ఆనంద్ దేవరకొండ – వైష్ణవి చైతన్య ఇటీవల వీరిద్దరి కాంబినేషన్లో బేబీ మూవీ తెరకెక్కిన సంగతి తెలిసిందే. సాయిరాజేష్ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ టాలీవుడ్ వద్ద భారీ బ్లాక్ బాస్టర్ అందుకుంది. ఈ సినిమాతో ఆ జంటకు మరింత క్రేజ్ పెరిగింది. వైష్ణవి చైతన్యత సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టకు ముందు కొద్దిగా క్రేజ్ ఉన్నప్పటికీ ఈ సినిమాతో అంతకుమించిన క్రేజ్ సంపాదించుకుంది. ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్గా మారిపోయిన వైష్ణవికి ప్రస్తుతం వరుస అవకాశాలు క్యూ కడుతునా.. ఆమె వచ్చిన ఆఫర్స్ అన్నిటిని ఓకే చేయకుండా ఆచితూచి అడుగులు వేస్తుంది.
కొన్ని సెలెక్టివ్ సబ్జెక్టులను మాత్రమే ఆమె తీసుకుంటూ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. ఇక మరో లవ్ స్టోరీ కోసం మళ్లీ ఈ జంట కలుస్తున్నారని అంతర్గత సినీవర్గాల నుంచి టాక్ వినిపిస్తుంది. తాజాగా ఆనంద్ దేవరకొండ సరసన డ్యూయెట్ అనే సినిమా చేయడానికి వైష్ణవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఆనంద్ దేవరకొండ ప్రధాన పాత్రలో మీదున్ అనే యువకుడు ఈ లవ్ స్టోరీని తెరకెక్కించటానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం ఇప్పటికే చాలామంది పేర్లను పరిశీలించారు. చివరిగా ఈ పాత్రకు వైష్ణవి చైతన్య సరిగ్గా సరిపోతుందని మూవీ టీం భావిస్తున్నట్లు సమాచారం.
నిజానికి బేబీ నిర్మాతలు వైష్ణవి చైతన్య, ఆనంద్ దేవరకొండ కాంబినేషన్లో మరో సినిమా చేయాలని భావించారు. కానీ సరైన కథ సెట్ కాకపోవడంతో ప్రాజెక్ట్ సెట్ చేయలేదు. ఈ నేపథ్యంలో ఈ జంట మిధున్ డైరెక్షన్లో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఇది యూత్ ఫుల్ లవ్ స్టోరీ అని అంటున్నారు. దసరా సందర్భంగా ఈ సినిమాను గ్రాండ్ గా ప్రారంభించబోతున్నారు.ప్రస్తుతం ఆ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. బేబీ సినిమాలో వైష్ణవి హ్యాండిచ్చినా.. ఆనంద్ మళ్లీ ఆమె వెంటే పడుతున్నాడు అంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు నెట్టిజన్లు.