ఉప్పెన.. చిన్న సినినిమాగా విడుదలై పెద్ద విజయం సాధించిన చిత్రాల్లో ఒకటి. ఈ మూవీతో మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అయితే.. కన్నడ బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. అలాగే డైరెక్టర్ బుచ్చిబాబుకు కూడా ఇది డెబ్యూ మూవీనే. సుకుమార్ ప్రియ శిష్యుడు అయిన బుచ్చిబాబు ఉప్పెన సినిమాను తెరకెక్కించగా.. దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు అందించాడు.
మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. తమిళ స్టార్ విజయ్ సేతుపతి ఇందులో విలన్ గా చేశాడు. 2021లో విడుదలైన ఈ చిత్రం.. తొలి ఆట నుంచే హిట్ టాక్ అందుకుంది. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. కరోనా టైమ్ లోనూ ఉప్పెన వంద కోట్ల క్లబ్ లో చేరి రికార్డు సృష్టించింది.
అయితే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. ఉప్పెన మూవీకి ఫస్ట్ ఛాయిస్ వైష్ణవ్ తేజ్ కాదు. టాలీవుడ్ కు చెందిన ఓ హీరో వద్ద ముందు ఉప్పెన కథ వెళ్లిందట. కానీ, కథ వినకుండానే ఆయన రిజెక్ట్ చేశాడట. ఇంతకీ ఆ అన్ లక్కీ హీరో మరెవరో కాదు న్మాచురల్ స్టార్ నాని. బుచ్చిబాబు మొదట నానీకి కథ చెప్పడానికి వెళ్లాడట. కానీ, అప్పటికే చేతి నిండా సినిమాలు ఉండటంతో.. బుచ్చిబాబు టైమ్ వేస్ట్ చేయడం ఇష్టలేక ముందే నాని సున్నితంగా నో అని చెప్పేశాడట. అలా నాని నుంచి చేజారిన ఉప్పెన.. వైష్ణవ్ చెంతకు చేరింది. బ్లాక్ బస్టర్ అయింది.