పవన్ “బ్రో” రేంజ్ పడిపోయింది అని చెప్పడానికి ఇంతకన్న బెస్ట్ ఎగ్జాంపుల్ మరోకటి ఉండదు.. ఫ్యాన్స్ ఎలా తట్టుకుంటారో..?

సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా వస్తుంది అంటే బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సందడి వాతావరణం నెలకొంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరీ ముఖ్యంగా ఆయన సినిమా రిలీజ్ అవుతుందని తెలిసిన పదిరోజుల ముందు నుంచే థియేటర్ వద్ద హంగామా చేస్తూ ఉంటారు ఫ్యాన్స్. భారీ ఫ్లెక్సీలతో కట్ అవుట్లతో.. పూల దండలతో.. పాలాభిషేకాలు చేస్తుంటారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. అయితే ఈ మధ్యకాలంలో మాత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రేంజ్ తగ్గిందని కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే దానిని నిజం చేస్తూ బ్రో సినిమా తెచ్చిన కలెక్షన్స్ అభిమానులను నిరాశ పరుస్తున్నాయి.

కాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉన్న మరోవైపు సినీ అభిమానులను ఎంటర్టైన్ చేయడానికి సినిమాల్లో నటిస్తున్నాడు . ఈ క్రమంలోనే సముద్రఖని దర్శకత్వంలో బ్రో అనే సినిమాలో నటించాడు . ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ కూడా ఓ రోల్ లో కనిపిస్తాడు . కాగా ఫుల్ టు ఫుల్ మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాగా తెరకెక్కిన ఈ మూవీ జూలై 28న బాక్సాఫీస్ వద్ద రిలీజ్ అయి యావరేజ్ టాక్ సంపాదించుకుంది.

ఈ సినిమా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి నచ్చిన కానీ కలెక్షన్స్ పరంగా మాత్రం డిజాస్టర్ గా మిగిలింది. అయితే బ్రో కన్నా ముందు రిలీజ్ అయిన బేబీ సినిమా థియేటర్స్ లో దూసుకుపోయింది . పెట్టిన దానికి ఏకంగా నాలుగు రెట్లు లాభాలు తీసుకొచ్చి బేబీ మేకర్స్ కు కాసుల వర్షం కురిపించింది. ఈ క్రమంలోనే మెగా ఫ్యామిలీ పై ఉండే అభిమానంతో డైరెక్ట్ సాయి రాజేష్ థియేటర్లో బేబీ సినిమా ఆడుతున్నా కానీ బ్రో సినిమాకి కేటాయించారు . అయితే బ్రో సినిమా కారణంగా ఆ థియేటర్ లకి పెద్దగా లాభాలు రాకపోవడంతో నాలుగు రోజులకే మేకర్స్ బ్రో సినిమాని తీసేసి మళ్లీ బేబీ సినిమాని ప్రదర్శిస్తున్నారు . దీంతో పవన్ కళ్యాణ్ రేంజ్ ఇలా పడిపోయింది అంటూ కొందరు జనాలు ..ఆయనని డీ గ్రేడ్ చేస్తూ కామెంట్ చేస్తున్నారు . దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ గా మారింది ..!!