కొంప ముంచేసిన త్రివిక్రమ్ అతి ఓవర్ యాక్షన్.. “గుంటూరు కారం” సినిమా నుండి ఆయన ఔట్..!?

పాపం .. తాను ఒకటి తెలిస్తే దైవం మరొకటి తలచిందా..? అన్నట్లు మహేష్ బాబు ఏ ముహూర్తాన త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు దర్శకత్వంలో గుంటూరు కారం సినిమాని మొదలుపెట్టారో తెలియదు కానీ . అప్పటినుంచి గుంటూరు కారం సినిమాకి సంబంధించిన ఏదో ఒకటి ట్రోలింగ్ కి గురవుతూనే ఉంది. మరీ ముఖ్యంగా ఈయన సినిమా స్టార్ట్ చేసిన టైం బాగోలేదు అంటూ ఫ్యాన్స్ కూడా భావిస్తున్నారు. ఇప్పటికే పలుసార్లు ఈ సినిమా షూటింగ్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. కారణాలు ఏవైనా కానీ సినిమా ఇండస్ట్రీలో ఏ స్టార్ హీరో కూడా తన సినిమాను ఇన్నిసార్లు పోస్ట్ పోన్ చేయించుకోలేదు .

అలాంటి చెత్త రికార్డు మహేష్ బాబు సొంతం చేసుకున్నాడు. అయితే రీసెంట్గా ఈ సినిమాకి సంబంధించిన మరో న్యూస్ నెట్టింట హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది . ఈ సినిమా కి వర్క్ చేస్తున్న పిఎస్ వినోద్ ఈ సినిమా నుంచి తప్పుకున్నారు అంటూ తెలుస్తుంది. త్రివిక్రమ్ తో అలా వైకుంఠపురంలో సినిమాకు పని చేసిన పీఎస్ వినోద్ గుంటూరు కారం సినిమా నుంచి అవుట్ అయ్యాడు అంటూ ప్రచారం జరుగుతుంది.

క్రియేటివ్ డిఫరెన్సులు వచ్చి ఈ ప్రాజెక్టుకు బై బై చెప్పి వెళ్ళిపోయారని సమాచారం అందుతుంది . దీంతో సోషల్ మీడియాలో మరోసారి త్రివిక్రమ్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న గుంటూరు సినిమాపై హ్యూజ్ రేంజ్ ట్రోలింగ్ గురవుతుంది . అసలు దీని అంతటికి కారణం త్రివిక్రమే నే అని.. త్రివిక్రమ్ లేనిపోని ఓవర్ యాక్టింగ్ చేయడం వల్లే సినిమా నుండి పూజా హెగ్డే ఇప్పుడు ఈయన వెళ్లిపోతున్నారు అని ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. దీనిపై త్రివిక్రమ్ ఎలా స్పందిస్తారో చూడాలి. ఇక వీఎస్ వినోద్ ప్లేస్ లోకి రవి చంద్రన్ వస్తున్నట్లు సమాచారం అందుతుంది..!!