కోటి రూపాయల రెమ్యూనరేషన్..బిగ్ బాస్ హౌస్ లోకి స్టార్ క్రికెటర్.. చరిత్రలోనే మొట్టమొదటి సారి ఇలా..!!

ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడ చూసినా సరే బిగ్ బాస్ సీజన్ సెవెన్ కి సంబంధించిన న్యూస్ లు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి. త్వరలోనే ప్రారంభం కాబోతున్న ఈ సీజన్ కి సంబంధించి బిగ్ బాస్ ప్రోమో కూడా రిలీజ్ చేసారు మేకర్స్. కాగా ఇప్పటికే హౌస్ లోకి వెళ్లే కంటెస్టెంట్స్ లిస్ట్ ఫైనలైజ్ అయిందని .. ఈసారి చాలా ఎక్కువ పారితోషకం ఇచ్చి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న కంటెస్టెంట్ ని హౌస్ లోకి పంపిస్తున్నారని వార్తలు వినపడుతున్నాయి .

కాగా ఇలాంటి క్రమంలోనే తెలుగు టెలివిజన్ చరిత్రలోనే అతిపెద్ద రియాల్టీ షో గా స్టార్ట్ అయిన బిగ్ బాస్ సీజన్ సెవెన్ లోకి ఇండియన్ స్టార్ క్రికెటర్ వేణుగోపాలరావు ఎంట్రీ ఇస్తున్నాడు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే బిగ్ బాస్ మేనేజ్మెంట్ వేణుగోపాల్ తో మాట్లాడిందని పూర్తిగా ఆయనకు ఫేవవర్ గా షో లో ఉంటుందని చెపుతున్నారు. అంతేకాదు అందరికన్నా హౌస్ లో ఎక్కువ పారితోషకం తీసుకుంటున్న కంటెస్టెంట్గా వేణుగోపాలరావు ఈసారి రికార్డు క్రియేట్ చేయబోతున్నాడు అన్న కామెంట్స్ కూడా వినపడుతున్నాయి . సుమార్ కోటి రూపాయలు దాక ఆయన అందుకునే అవకాశం ఉందట.

అయితే కచ్చితంగా టాప్ ఫైవ్ వరకు బిగ్ బాస్ మేనేజ్మెంట్ హౌస్ లో ఉంచే విధంగానే ప్లాన్ చేసిందని ..మరో వార్త కూడా హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఒకవేళ నిజంగా ఇది నిజమైతే మాత్రం బిగ్ బాస్ చరిత్రలోనే ఫస్ట్ టైం ఇండియన్ క్రికెటర్ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు . దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ గా మారింది..!!