పవన్ కళ్యాణ్ దమ్ము, ధైర్యం గురించి మాట్లాడిన రోజా… షాకింగ్ కౌంటర్ ఇచ్చిన పృథ్వీరాజ్..

ప్రముఖ టాలీవుడ్ నటుడు, కమెడియన్ 30 ఇయర్స్ పృథ్వీరాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం పృథ్వి వరుస అవకాశాలతో బిజీగా ఉన్నాడు. అలానే రాజకీయాల్లో కూడా బిజీగా ఉన్నాడు. పృథ్వీరాజ్ ఈసారి జనసేన పార్టీ నుంచి పోటీ చేసే అవకాశం ఉందని సమాచారం. దీనికి సంబంధించిన ప్రకటన అధికారంగా చేయాల్సి ఉంది. ఒకవేళ అతనికి పార్టీ టికెట్ దక్కకపోతే కేవలం జనసేన పార్టీ ప్రచారానికి పరిమితం అవకాశాలు ఉంటాయి.

అయితే వైసీపీ మంత్రి ఆర్కే.రోజా రీసెంట్ గా పవన్ కళ్యాణ్ దమ్ము, ధైర్యం గురించి షాక్ ఇచ్చేలా కామెంట్స్ చేసింది. పవన్ కళ్యాణ్ పై రోజా చేసిన విమర్శలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. రోజా ఎంత విమర్శించినప్పటికీ పవన్ కళ్యాణ్ మాత్రం ఆమెను తిరిగి ఏమీ అనలేదు. అయితే పృథ్వీరాజ్ మాత్రం రోజాపై తీవ్ర విమర్శలు కురిపించాడు. ప్రస్తుతం పృథ్వీరాజ్ రోజా గురించి చేసిన విమర్శలు హాట్ టాపిక్ గా మారాయి.

పృథ్వీరాజ్ మాట్లాడుతూ’ మనం ఏమైనా కబడ్డీ ఆడుతున్నామా.. దమ్ము, ధైర్యాల గురించి మాట్లాడుతున్నావు, అయినా మేమేమీ వీధి రౌడీలం కాదు. మాకు దమ్ము ధైర్యం అవసరం లేదు. కేవలం తండ్రి లేని బిడ్డ అనే సానుభూతి తోనే స్వల్ప మెజారిటీ తో గత ఎన్నికలో 65 సీట్లతో గెలిపించారు.’ అంటూ పృథ్వి తెలిపారు. కానీ ఇప్పుడు మాత్రం ఎన్నికలు పెడితే కచ్చితంగా జనసేనకే ప్రజలు మద్దతుగా నిలుస్తారు అని ఆయన వెల్లడించారు.

రోజా ఎప్పుడూ ఫైర్ బ్రాండ్ గానే  మాటల తూటాలు పేలుస్తుంటారు. మరి పృథ్వీరాజ్ పై ఆమె ఎలాంటి సంచలన వ్యాఖ్యలు చేస్తారో ఇప్పుడు మరింత హాట్ టాపిక్ గా మారింది.