ఓరి దేవుడోయ్..వేదం మూవీలో ఆ పాత్ర‌ను బాలయ్య డైరెక్ట‌ర్ చేయాలి అనుకున్నాడా..? ఎందుకు మిస్ అయ్యిందంటే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎప్పుడు ఒకటే టైప్ సినిమాలు తీస్తూ ఉంటారు అని పలువురు డైరెక్టర్స్ ని ట్రోల్ చేస్తూ ఉంటారు కొందరు కుర్రాళ్ళు ..ఆకతాయిలు . మరీ ముఖ్యంగా ఎప్పుడు అదే యాక్షన్ సీన్స్ అదే లవ్ అండ్ రొమాంటిక్ సీన్స్ ..అదే ఫ్యామిలీ సెంటిమెంట్ సీన్స్ ..అంటూ చాలా సందర్భాల్లో స్టాప్ డైరెక్టర్స్ ని ట్రోల్ చేశారు. అయితే వాళ్ళందరికీ చెక్ పెడుతూ టాలీవుడ్ ఇండస్ట్రీలో డిఫరెంట్ డిఫరెంట్ కధలను తెరకెక్కిస్తూ స్టార్ డైరెక్టర్గా మారాడు క్రిష్ .

ఆయన దర్శకత్వంలో ఇప్పటివరకు తెరకెక్కిన సినిమాలన్నీ చాలా చాలా డిఫరెంట్ గా ఉంటాయి అన్న విషయం అందరికీ తెలిసిందే. వాటిల్లో ఒకటి వేదం . ఈ సినిమా కమర్షియల్గా హిట్ కానప్పటికీ అందరి మనసులను హద్దుకునింది . ఈ సినిమాలో అనుష్క ఓ వేశ్య పాత్రలో కనిపిస్తుంది. అల్లు అర్జున్ – దీక్ష సేథ్ – మంచు మనోజ్ కూడా డిఫరెంట్ క్యారెక్టర్స్ లో కనిపిస్తారు . అయితే ఈ సినిమాలో కర్పూరం పాత్ర కోసం ఓ స్టార్ డైరెక్టర్ చేయాలని తెగ ఆశపడ్డారు అన్న న్యూస్ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది .

ఎస్ ఈ సినిమాలో అనుష్క శెట్టి వెంటనే ఉండే పాత్ర కర్పూరం. ఈ పాత్రను చేసింది అనుష్క పరసనల్ మేకప్ మ్యాన్ నిక్కి . అయితే ఈ పాత్ర కోసం టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ క్రిష్ ఎంతో ఆశపడ్డారట . తానే స్వయంగా ఈ పాత్రలో నటించాలని అనుకున్నారట . అయితే వాళ్ళ అమ్మ మాత్రం ఒప్పుకోనే ఒప్పుకోలేదట . ఈ పాత్రలో చేస్తే నీకు పెళ్లి కాదు అంటూ ఓపెన్ గా చెప్పేసిందట. ఆ భయంతోనే క్రిష్ ఈ పాత్రను మిస్ చేసుకోవాల్సి వచ్చింది .. లేకపోతే ఎంతో ఇష్టంగా రాసుకున్న ఈ పాత్రలో ఆయన నటించి ఉంటే సినిమా మరింత స్థాయిలో హిట్ అయి ఉండేది అంటున్నారు అభిమానులు..!!