బాలయ్య-సాయిపల్లవి కాంబినేషన్ లో.. మిస్ అయిన బ్లాక్ బస్టర్ సినిమా ఇదే..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి నటసింహం బాలయ్యకు ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆయనతో ఒక్కసారైనా కలవాలి అని.. ఆయనతో ఒక్క సినిమా అయినా చేయాలని సినిమా ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్స్ తెగ ఆతృత పడుతూ ఉంటారు. అయితే అలాంటి ఛాన్స్ వస్తే ఏ హీరోయిన్ మిస్ చేసుకోదు . కానీ సాయి పల్లవి మాత్రం రీజన్ చెప్పకుండా బాలయ్య సినిమాను మిస్ చేసుకునింది అన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న సాయి పల్లవి లేడీ పవర్ స్టార్ అంటూ ట్యాగ్ క్రియేట్ చేసుకుంది . సాయి పల్లవి తనకు పాత్ర నచ్చకపోతే ఎలాంటి రోల్స్ నైనా రిజెక్ట్ చేస్తుంది అన్న విషయం అందరికీ తెలిసిందే . కాగా అలాంటి సాయి పల్లవి బాలయ్య సినిమాను రిజెక్ట్ చేసింది అన్న కామెంట్లు ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్నాయి . బాలయ్య రీసెంట్ గా నటించిన సినిమా వీరసింహారెడ్డి . సంక్రాంతి కానుకగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ టాక్ నమోదు చేసుకుంది.

బాలయ్య కెరియర్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కలెక్షన్స్ సాధించిన మూవీగా రికార్డు నెలకొల్పింది. అయితే ఈ సినిమాలో బాలయ్య చెల్లెలు పాత్ర కోసం ముందుగా సాయి పల్లవిని చూస్ చేసుకున్నారట డైరెక్టర్ గోపీచంద్ మలినేని. కానీ ఆమె ఈ పాత్ర నచ్చకపోవడంతో రిజెక్ట్ చేసిందట . అయితే ఆమె ఏ రీజన్ చెప్పకుండా ఈ పాత్రను రిజెక్ట్ చేయడంతో దైరెక్టర్ హర్ట్ అయ్యారట. అందుకే సెకండ్ అప్షన్ కింద వరలక్ష్మి శరత్ కుమార్ ను చూస్ చేసుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . ఇలా బాలయ్యతో నటించే అవకాశాన్ని మిస్ చేసుకునింది సాయి పల్లవి అంటూ జనాలు మండిపడుతున్నారు..!!