“నీ యమ్మ..ఏంది రా ఇది”.. లైవ్ లోనే రెచ్చిపోయిన రష్మిక మందన్నా..!!

నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న రష్మిక మందన గురించి ఎంత చెప్పినా తక్కువే . ఛలో సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందన .. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది . ఆ తర్వాత పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ సంపాదించుకొని టాలీవుడ్ – బాలీవుడ్ -కోలీవుడ్ ఇండస్ట్రీలలో టాప్ మోస్ట్ హీరోయిన్గా రాజ్యమేలేస్తుంది .

అయితే రష్మిక ఇంతటి క్రేజీ స్థానాన్ని అందించుకోవడానికి కారణం ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండడమే . తన వద్దకు వచ్చిన అభిమానులకు ఫోటోలు లేదు అంటూ చెప్పకుండా ఓపికగా ఫొటోస్ కి ఫోజులు ఇవ్వడమే అంటూ తెలుస్తుంది. ఈ క్రమంలోనే రీసెంట్గా రష్మిక మందన అభిమానులతో ఓ చిట్ చాట్ పాల్గొనింది. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది.

ఈ క్రమంలోనే ఓ నెటిజన్ తెలంగాణ యాసలో మాట్లాడమంటూ కోరారు . దీంతో రష్మిక మందన సెకండ్ కూడా తడుముకోకుండా హైదరాబాద్ అభిమాని కోరిక ప్రకారం ..”నమస్తే ..ఎట్లున్నారు వచ్చేశేయ్యుండ్రి.. మస్తుంది..నీ యమ్మ.. ఏందిరా ఇది.. కొడదాం ” అంటూ తెలంగాణ భాషలో చాలా చక్కగా మాట్లాడింది . దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది..!!