టాలీవుడ్ లో నటుడు రాజేంద్రప్రసాద్ తర్వాత అంతటి స్థానాన్ని భర్తీ చేయగలిగిన నటులలో అల్లరి నరేష్ కూడా ఒకరు. కామెడీ ప్రధాన సినిమాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకున్న అల్లరి నరేష్ గత కొంతకాలంగా కుర్ర హీరోల నుంచి గట్టి పోటీలు ఎదురవుతూ ఉండడంతో అల్లరి నరేష్ సినిమాల సక్సెస్ లో కాస్త వెనుక పడ్డారని చెప్పవచ్చు. ప్రేక్షకులను తన కామెడీతో అలరించలేకపోతున్నారు.
ఇదంతా ఇలా ఉంటే అల్లరి నరేష్ తో యముడికి మొగుడు సినిమాను తెరకెక్కించిన డైరెక్టర్ ఫ్రెండ్లీ మూవీస్ ఓనర్ చంటి అడ్డాల ఈ చిత్రం కోసం రామోజీ ఫిలిం సిటీ లో కోట్ల రూపాయలు ఖర్చు చేసి యమలోకం సెట్ వేశారట. ఆ రోజుల్లోనే యముడికి మొగుడు సినిమా కోసం ఏకంగా రూ .12 కోట్ల రూపాయల బడ్జెట్ అయ్యిందట. ఎప్పటికీ నరేష్ గా ఉన్న మార్కెట్తో పోలిస్తే ఇది చాలా ఎక్కువే అని చెప్పవచ్చు. ఈ సినిమా ప్రారంభోత్సవానికి నటుడు డైరెక్టర్ దాసరి నారాయణరావు, దివంగత నిర్మాత రామానాయుడు కూడా హాజరైనట్లు తెలుస్తోంది.
అక్కడ వేసిన సెట్ ను దాసరి నారాయణరావు ఆశ్చర్యపోయారట. వెంటనే నిర్మాతను పిలిచి ఏరా బుద్ధుందా నీకు వాడిని హీరోగా పెట్టి ఇంత భారీ బడ్జెట్ సినిమా తీయడం అవసరమా అంటూ.. రేపు రిలీజ్ లో ఇబ్బందులు వస్తాయి చాలా జాగ్రత్తగా ఉండు అంటు హెచ్చరించారట. అంతేకాకుండా వాడి మార్కెట్ ఎంతో తెలుసుకొని ప్లానింగ్ చేసుకోవాలి కదా అంటూ గట్టి వార్నింగ్ ఇచ్చారట..
ఆ తర్వాత రామానాయుడు కూడా నేను ఈ సినిమాను ఓన్ గా రిలీజ్ చేసుకుంటాను నాకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు… కానీ నువ్వు వేరే వాళ్ళకి అమ్ముతావు రిలీజ్ కి ముందే నష్టాలకు అమ్మితే చాలా ఆర్థిక ఇబ్బందులు వస్తాయని ఆ డైరెక్టర్ , నిర్మాత తో హెచ్చరించారట. కానీ వారు అనుకున్నట్టుగానే ఆ సినిమా విడుదలై అంచనాలను అందుకోలేక పోయిందట నిర్మాత చంటి ఆర్థికంగా నష్టపోయినట్లు ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.