పెళ్లి అయిన ఇన్నేళ్లకు..తన చిరకాల కోరిక తీర్చేసుకున్న రాజమౌళి..వీడియో వైరల్..!!

దర్శక ధీరుడుగా పేరు సంపాదించుకున్న రాజమౌళి రీసెంట్ గానే ఆర్ఆర్ఆర్ సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు . ఈ సినిమాతో కోట్లాదిమంది ఇండియన్ అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురుచూసిన ఆస్కార్ అవార్డు సైతం తీసుకొచ్చారు . ఆర్ఆర్ఆర్ సినిమాలో నాటు నాటు పాటకు గాను ఒరిజినల్ సాంగ్ విభాగంలో భాగంగా ఆస్కార్ అవార్డు లభించింది . ఇదే మన ఇండియన్ సినిమాకి వచ్చిన ఫస్ట్ ఆస్కార్ అవార్డ్ కావడం విశేషం. కాగా త్వరలోనే మహేష్ బాబుతో రాజమౌళి సెన్సేషనల్ సినిమాని తెరకెక్కించబోతున్నారు . దీనికి సంబంధించిన పనులు కూడా చకచక పూర్తి చేస్తున్నారు .

ఇలాంటి క్రమంలోనే కొద్దిపాటి రిలాక్స్ అయ్యే పనిలో ఉన్నారు రాజమౌళి. ఈ క్రమంలోనే ఆయన ఆధ్యాత్మిక సేవలో మునిగి తేలుతున్నారు . తన ఫ్యామిలీతో కలిసి ఆయన టూర్ వెళ్లారు . ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకొచ్చారు . తమిళనాడులో ఆయన ప్రముఖ దేవాలయాలను సందర్శించారు . అంతేకాదు దేవాలయాలను సందర్శించడం ద్వారా వచ్చే పాజిటివ్ ఎనర్జీ తన మనసు ఎంత ప్రశాంతంగా ఉందో వీడియోలో రాసుకోచ్చాడు .

ఈ క్రమంలోనే వీడియోలో జక్కన్న టెంపుల్స్ కి వెళ్లి అక్కడ నేచర్ ని ఎంజాయ్ చేశారు . అయితే ఎప్పటినుంచో జక్కన్నకు ఓ కోరుక ఉండేదట. రోడ్డు జర్ని బాగా ఎంజాయ్ చేసే విధంగా ఫ్యామిలీ మొత్తంతో కలిసి సరదా సరదాగా పుణ్యక్షేత్రాలకు వెళ్లాలని .. అయితే పెళ్లయిన ఇన్నేళ తర్వాత తన చిరకాల కోరిక నెరవేరిందని వెల్లడించాడు రాజమౌళి. రోడ్ ట్రిప్ ఎంజాయ్ చేస్తూ తమిళనాడులోని దేవాలయాలను సందర్శించానని చాలా ఆనందంగా ఆహ్లాదకరంగా ఉంది అంటూ చెప్పకు వచ్చాడు. అంతేకాదు మా అమ్మాయికి ధన్యవాదాలు ఈ ప్లాన్ చేసింది ఆ అమ్మాయి.
జూన్‌ చివరి వారమంతా శ్రీరంగం, బృహదీశ్వరాలయం, రామేశ్వరం, కనడుకథన్‌, తూత్తుకూడి, మధురై దేవాలయాలను సందర్శించామని తెలిపారు.