కమెడియన్ ఎం. ఎస్. నారాయణ ని ట్రైన్ లో చంపేయాలి అనుకున్నారా..? ఆ రోజు నైట్ ఏం జరిగింది..?

ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో కమెడియన్స్ అంటే ఎలాంటి వల్గర్ డైలాగ్స్.. బూతు పదాలను వాడుతూ పంచెస్ వేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఒకప్పుడు కమెడియన్స్ అంటే మాత్రం చాలా హెల్తీగా ఆహ్లాదకరంగా కుటుంబ సమేతంగా నవ్వుకునేలా వినసొంపుగా వినే కామెడీ డైలాగ్స్ ను పలికేవారు . ఆ లిస్టులో టాప్ పొజిషన్లో ఉంటాడు ఎంఎస్ నారాయణ . ఈయన డైలాగ్ చెప్తే కాదు తెరపై కనిపిస్తేనే జనాలు పకపకా నవ్వేసేవారు. అంతలా తన బాడీ మోడ్యుయేషన్ తోనే కామెడీని పండించే సత్తా ఉన్నది ఎంఎస్ నారాయణ గారికి . కాగ ఎంఎస్ నారాయణ పలు సినిమాల్లో తన యాక్టింగ్ తో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు .

మన మధ్య లేకపోయినా సరే నారాయణ తన సినిమాల ద్వారా ఇప్పటికీ అభిమానుల్ని నవ్విస్తూనే ఉన్నాడు . కాగ ఈ క్రమంలోని నారాయణకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది . నారాయణను ట్రైన్ లో నే చంపాలని చూసారు అన్న న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది . ఓ రోజు చెన్నైకి రైల్లో ప్రయాణం చేస్తున్న ఎంఎస్ నారాయణను ఏడుగురు అబ్బాయిలు ఫాలో అయ్యారట . అయితే ఆ ఏడుగురు అబ్బాయిలు కూడా టికెట్లు లేకుండా ట్రైన్లో ప్రయాణిస్తున్నారట . ఈ క్రమంలోనే టీసి వచ్చి టికెట్ అడిగితే.. నెక్స్ట్ స్టేషన్ లో టికెట్ తీసుకుంటాము..ఒక్కవేళ రాకపోతే ..మా తమ్ముడు ఈయన అని ఎమ్మెస్ నారాయణ వైపు వేలు చూయించి ఎస్కేప్ అయ్యారట.

దీంతో వాళ్ళు ట్రైన్ దిగ్గి వెళ్లిపోయిన సరే ఇంకా రాకపోయేసరికి ఎమ్మెస్ నారాయణ వద్దకు వచ్చి ఆ టీసి” మీ అన్నయ్య ఇంకా రాలేదు ..డబ్బులు ఇవ్వు” అంటూ డిమాండ్ చేశారట . దీంతో ఎంఎస్ నారాయణ షాక్ అయిపోయి “నాకు అన్న ఎవరున్నారు..? వాళ్ళు ఎవరో నాకు తెలియనే తెలియదు..?” అంటూ చెప్పుకొచ్చారట . అయితే ఈ క్రమంలోనే ట్రైన్ లో నుంచి తోసేయాలని అంత కోపం వచ్చేసిందట ఆ టీసికి. నారాయణ కూడా తిక్క తిక్క వేషాలు వేయకు అంటూ రఫ్పాడించేసాడట . అలా ఆరోజు ట్రైన్ లో జరిగిన ఇన్సిడెంట్ ఎప్పటికీ మర్చిపోలేని అంటూ గతంలో ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు ఎంఎస్ నారాయణ..!!