తమన్నా – బాలయ్య కాంబోలో మిస్ అయిన ఆ సూపర్ డూపర్ హిట్ సినిమా ఏంటో తెలుసా..?

సినిమా ఇండస్ట్రీలో నందమూరి బాలయ్యకు ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ బాగా తెలిసిన విషయమే. వయసు పెరిగిపోతూ ఉండే కొద్ది ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా అదే విధంగా పెరుగుతుంది . మొన్నటికి మొన్న ఓ సినిమా ఈవెంట్లో ఆయన కూతురు బ్రాహ్మణి మాట్లాడుతూ “మా నాన్నగారు వయస్సు పెరిగిపోయే కొద్ది మరింత ఎనర్జిటిక్ గా తయారవుతున్నారు ” అని ఓపెన్ గానే చెప్పుకొచ్చింది . అఫ్కోర్స్ ఆమె చెప్పింది కరెక్టే వయసు పెరిగిపోతు ఉండే కొద్ది బాలయ్యలు ఎనర్జటిక్ లెవెల్స్ ఇంకా పెరిగిపోతున్నాయి .

అందుకే ఇంత ఏజ్ లోను యంగ్ హీరోలా చకచక సినిమాలకు సైన్ చేస్తూ కమిట్ అయినా సినిమాలను రిలీజ్ చేసేస్తున్నారు. కాగా ఫ్లోర్ మూమెంట్స్ కూడా వేస్తున్నారు అంటూ ఈ మధ్యకాలంలో వార్తలు వినిపించాయి .ఇలాంటి క్రమంలోనే బాలయ్య తన సినిమాలో యంగ్ బ్యూటీస్ ని చూస్ చేసుకుంటున్నారు. అయితే అలాంటి ఆఫర్ వస్తే మిల్కీ బ్యూటీ తమన్న రిజెక్ట్ చేయడం నందమూరి అభిమానులకి కోపం తెప్పించింది
. బాలయ్య హీరోగా లేటెస్ట్ గా రిలీజ్ అయిన సినిమా వీరసింహారెడ్డి . సంక్రాంతి కానుకగా బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ నమోదు చేసుకోవడమే ..కాకుండా బాలయ్య కెరియర్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కలెక్షన్స్ సాధించి చెరగని రికార్డును క్రియేట్ చేసింది .

ఈ సినిమాలో బాలయ్యకు జోడిగా హనీ రోజ్- శృతిహాసన్ నటించారు. గోపీచంద్ మలినేని ఈ సినిమాలో మొదటగా శృతిహాసన్ పాత్ర కోసం తమన్న ను చూస్ చేసుకున్నారట. అయితే తమన్నా కాల్ షీట్స్ అడ్జస్ట్ చేయలేను అంటూ ఈ సినిమాను సున్నితంగా రిజెక్ట్ చేసిందట . కానీ తమన్నా ప్లేస్ లో శృతిహాసన్ ఈ సినిమాకు సైన్ చేసి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకుంది . దీనితో నందమూరి ఫ్యాన్స్ అయితే తమన్నా కంటే శృతిహాసన్ ఈ పాత్రకు బాగా సెట్ అయిందని .. ఆమె సినిమా చేయకపోవడం మంచి పనినే అని.. సినిమా ఇంత హిట్ అయినందుకు హ్యాపీగా ఫీల్ అయ్యారట. దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ గా మారింది . తమన్నా మంచి క్రేజీ ఆఫర్ ను మిస్ అయినట్లయింది..!!