టీడీపీ నేత ఫామ్ హౌస్ లో అల్లు అర్జున్.. పొలిటికల్ హీట్ పెంచేసిన పుష్ప రాజ్..!!

ఈ మధ్యకాలంలో పాలిటిక్స్ లో ఏవేవో జరిగిపోతున్నాయి . ఎవరెవరో ఎంట్రీ ఇస్తున్నారు. ముఖానికి రంగులు పూసే వాళ్ళు కూడా రాష్ట్రాలని ఏలేయాలని చూస్తున్నారు . అలా ముఖానికి రంగులు పూసుకున్న వాళ్ళు ఎంతోమంది పాలిటిక్స్ లోకి వచ్చి కొందరు సక్సెస్ అయ్యారు ..మరికొందరు బొక్క బోర్ల పడి.. మళ్ళీ ఇండస్ట్రీలోకి వెళ్లి సినిమాలు చేసుకుంటున్నారు అ. యితే ఇక్కడ ఓ హీరో ఇండస్ట్రీలో టాప్ గా ఉన్న ఓ స్టార్ రాజకీయ నాయకుడిని కలవడం .. ఆయన ఫామ్ హౌస్ లో లంచ్ చేయడం .. ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . ఆయన మరెవరో కాదు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ . మనకు తెలిసిందే అల్లు అర్జున్ పేరు చెప్తే ఊగిపోని జనాలు ఎవ్వరూ ఉండరు .

ఆయనకు రాజకీయ నేతలు కూడా చాలామంది ఫాన్స్ ఉన్నారు. అలాంటి ఒక క్రేజీ స్థానాన్ని సంపాదించుకున్నాడు అల్లు అర్జున్ . ప్రెసెంట్ పుష్ప 2 సినిమా షూటింగ్లో బిజీ బిజీగా ఉన్నాడు . గత 24 గంటల నుంచి సోషల్ మీడియాలో అల్లు అర్జున్ కి సంబంధించిన ఫోటో వైరల్ గా మారింది . అల్లు అర్జున్ ఎవరు ఊహించిన విధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేత ఫామ్ హౌస్ లో మెరిశారు. అంతేకాదు అక్కడ రుచికరమైన రాయలసీమ వంటకాలతో బన్నీ తన భోజనాన్ని బాగా ఎంజాయ్ చేశారు . అల్లు అర్జున్ హైదరాబాద్ నుంచి తన స్నేహితులతో కలిసి బెంగళూరు వెళుతుండగా మార్గ మధ్యలో గార్లదిన్నె మండలం కనపల్లిలో ఆగారు .

దీనితో అల్లు అర్జున్ అనంతపురం జిల్లా టిడిపి నాయకుల నుంచి స్వాగతం లభించింది. శింగనమల ద్విసభ్య కమిటీ సభ్యులు ముంటిమడుగు కేశవరెడ్డి అల్లు అర్జున్ ని తన ఫామ్ హౌస్ లోకి తీసుకెళ్లి భోజనాలు ఏర్పాటు చేశారు . ఆయన కుమారుడు రాహుల్ రెడ్డి కూడా బన్నీకి వెల్కమ్ చెప్పడం విశేషం . దీంతో ప్రజెంట్ ఈ దృశ్యాలు వైరల్ గా మారాయి . అయితే మరి కొంతమంది బన్నీ ఇలా రాజకీయనేతలతో ఫోటో దిగడం పట్ల ఆయనకు రాజకీయాలపై ఇంట్రెస్ట్ ఉంది అన్న కామెంట్లు వినిపిస్తుంటే.. బన్నీ అభిమానులు మాత్రం బన్నీకి రాజకీయాలంటే ఇంట్రెస్ట్ లేదని ..ఆయన కెరియర్ సినీ జీవితానికి అంకితం అని చెప్పుకొస్తున్నారు. ఏమో ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో ఏవేవో జరిగిపోతున్నాయి .. రానున్న రోజుల్లో బన్నీ కూడా రాజకీయాల్లోకి రావచ్చు ఏమో..చూద్దాం..!!