తెలుగులో రెండు దశాబ్దాల క్రిందట వచ్చిన `నువ్వే కావాలి` సినిమా తెలుగు ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసింది. అప్పట్లో యువత `నువ్వే కావాలి` సినిమా అంటే పిచ్చెక్కిపోయారు. యువతను అంతలా మత్తులోకి దింపేసింది. ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ పై రామోజీరావు నిర్మించిన ఈ సినిమాలో తరుణ్, సాయికిరణ్ హీరోలుగా నటించగా.. రీచా హీరోయిన్ గా నటించింది. కే విజయ భాస్కర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.
ఆ రోజుల్లోనే ఈ సినిమా చాలా ధియేటర్లలో ఏడాదికి పైగా ఆడిందంటే.. నువ్వే కావాలి మానియా నాటి తెలుగు గెడ్డను ఎంతలా ఊపేసిందో అర్థం చేసుకోవచ్చు. నువ్వేకావాలి సినిమాలో పాటలు అన్నీ సూపర్ హిట్. ఈ సినిమాలో తరుణ్ తో పాటు అలనాటి మేటి గాయకుడు రామకృష్ణ తనయుడు సాయికిరణ్ కూడా మరో హీరోగా నటించాడు. ఈ సినిమా తర్వాత సాయికిరణ్ కు టాలీవుడ్ బడా నిర్మాత డాక్టర్ డి రామానాయుడు తన సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లో నిర్మించిన `ప్రేమించు` సినిమాలో హీరోగా నటించే అవకాశం ఇచ్చారు.
ఈ సినిమాలో సాయికిరణ్కు జోడీగా లయ నటించింది. ఈ సినిమా అప్పట్లో ఎంతో ఘన విజయం సాధించింది. పాటలు కూడా సినిమా విజయంలో ఎంతో కీలకంగా నిలిచాయి. ఆ తర్వాత యంగ్ హీరోల పోటీ తట్టుకోలేక సాయికిరణ్ బుల్లితెర హీరోగా మారిపోయి సీరియల్స్ తో అలరించడం మొదలుపెట్టాడు. ఇక ప్రేమించు సినిమాలో జంటగా నటించిన సాయికిరణ్, లయ పెళ్లి చేసుకోవాలని అనుకున్నారట.
ఇది నిజమే అని సాయికిరణ్ కూడా ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు. అటు సాయికిరణ్ తల్లిదండ్రులు, ఇటు లయ తల్లిదండ్రులు కూడా వీరిద్దరికి పెళ్లి చేస్తే బాగుంటుందని భావించారట. అయితే వీరిద్దరి జాతకాలు కలవకపోవడంతో వీరి పెళ్లి జరగలేదని.. అంతకుమించి మరో కారణం లేదని సాయికిరణ్ చెప్పుకొచ్చాడు. ఈ ఇష్యూ తర్వాత కూడా మేమిద్దరం కలిసి ఓ సినిమాలో నటించామని కూడా తెలిపాడు.
ఇప్పటికి కూడా మా మధ్య మంచి స్నేహం కొనసాగుతుందని సాయి కిరణ్ చెప్పుకొచ్చాడు. ముందు జాతకాలు ట్రాష్ అనుకునేవాడిని అని.. ఆ తర్వాత ఒక్కో గ్రహం మన జీవితాన్ని ఎలా ?ప్రభావితం చేస్తుందో తెలిశాక తాను కూడా జాతకాలను నమ్ముతున్నానని సాయికిరణ్ తెలిపాడు. ఇక సాయికిరణ్ గొప్ప శివ భక్తుడు అన్న విషయం తెలిసిందే. ఆ తర్వాత లయ అమెరికాకు చెందిన ఓ ఎన్ఆర్ఐ డాక్టర్ ను పెళ్లి చేసుకుని అక్కడ సెటిల్ అయిపోయింది. ఇక ఇప్పుడు సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది.