రెబల్ స్టార్ ప్రభాస్ డైరెక్టర్ ఓంరావు దర్శకత్వంలో వస్తున్న చిత్రం ఆది పురుష్.. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంటోంది .ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్ వర్క్ ప్రస్తుతం జరుగుతూనే ఉంది సుమారుగా రూ.500 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాని మొదటిసారి ఇన్ని కోట్ల రూపాయలతో T సిరీస్ తెరకెక్కిస్తూ ఉండడం గమనార్హం ..రామాయణం కథ ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించడం జరిగింది.
ఇందులో రాముడు పాత్రలో ప్రభాస్ నటించిన సీత పాత్రలో కృతి సనన్, రావణాసుడి పాత్రలో సైఫ్ అలీఖాన్ నటించారు. ఈ చిత్రం జూన్ 16వ తేదీన విడుదల కాబోతున్నది.. ఈ సినిమా విడుదల సమయం కేవలం రెండు నెలలు మాత్రమే ఉన్నది. ఇప్పటికి ఈ సినిమాకి ఎలాంటి హైప్ ఏర్పడలేదు. ఈ సినిమా థియేటర్లు బిజినెస్ కూడా ఇప్పటికే పూర్తి అయిపోవాల్సి ఉండగా ఇప్పటివరకు అసలు మొదలే కాలేదని వార్తలు వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలోనే ఈ సినిమా పైన పలు రూమర్లు వినిపిస్తున్నాయి.
స్టార్ హీరో సినిమా అయినప్పటికీ కనీసం డిజిటల్ రైట్స్ కోసం కూడా ఎవరు ముందుకు రాకపోవడంతో అందరూ షాక్ గురవుతున్నారు. బాలీవుడ్ లో ఈ సినిమా పైన పలు రకాలుగా రూమర్లు వినిపిస్తూనే ఉన్నాయి. సినిమాకు సంబంధించి టీజర్ ని గత ఏడాది విడుదల చేయక ఈ టీజర్ పైన పలు వివాదాలు చుట్టుముంటాయి. ముఖ్యంగా గ్రాఫిక్స్ నేపథ్యంలో ఈ సినిమా విమర్శలు కూడా ఎదుర్కొంది దీంతో మళ్లీ రూ .100 కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు చేసి విఎఫ్ఎక్స్ వర్కును పూర్తి చేశారు. తాజాగా శ్రీరామనవమి సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ పై కూడా ఎలాంటి బస్ ఏర్పడలేదు. దీంతో నిర్మాత భూషణ్ కుమార్ చాలా టెన్షన్ పడుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.