తెలుగులో మరో బిగ్ ప్రాజెక్ట్ కి సైన్ చేసిన కీర్తి సురేష్.. హీరో ఎవరో తెలిస్తే ..పూనకాళ్లు పక్క..!?

టాలీవుడ్ మహానటిగా పేరు సంపాదించుకున్న కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అందంలో ..నటనలో ..అభినయంలో తనకంటూ ప్రత్యేక టాలెంట్ ఉన్న కీర్తి సురేష్.. రీసెంట్ గానే దసరా అనే సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది . శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో తెరకెక్కిన దసరా సినిమాలో నాని హీరోగా నటించాడు. ఈ సినిమాలో వెన్నెల పాత్రలో కీర్తి సురేష్ ఎంతలా ఒదిగిపోయి నటించిందో మనందరికీ తెలిసిన విషయమే .

మరీ ముఖ్యంగా పెళ్లి తర్వాత వచ్చిన భరత్ డాన్స్ లో కీర్తి సురేష్ విజృంభించేసింది . మాస్ లుక్ లో ఊర నాటు స్టెప్స్ వేస్తూ ఇండస్ట్రీని షేక్ చేసింది . ఇప్పటికి ఆమె డాన్స్ వేసిన పిక్స్ వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. కాగా ఇలాంటి క్రమంలోనే కీర్తి సురేష్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏవిధంగా సైన్ చేయబోతుంది ..ఎలాంటి ప్రాజెక్ట్ ను యాక్సెప్ట్ చేయబోతుంది అంటూ ఇన్నాళ్లు చర్చించుకున్నారు జనాలు . కాగా అందుతున్న సమాచారం ప్రకారం కీర్తి సురేష్ పాన్ ఇండియా సినిమాకి సైన్ చేసింది అంటూ తెలుస్తుంది .

బుచ్చిబాబు సన డైరెక్షన్ లో రామ్ చరణ్ ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీలో కీర్తి సురేష్ వన్ అఫ్ ది హీరోయిన్ గా సెలెక్ట్ అయినట్లు న్యూస్ వైరల్ అవుతుంది . అంతేకాదు సినిమాకి సైన్ కూడా చేసిందట . ఈ క్రమంలోనే మొదటి హీరోయిన్గా జాన్వీ కపూర్ .. రెండవ హీరోయిన్గా కీర్తి సురేష్ నటిస్తున్నారు అంటూ ఓ న్యూస్ ట్రెండ్ అవుతుంది . ఒకవేళ నిజంగా ఇది నిజమైతే మాత్రం కీర్తి సురేష్ దశ తిరిగిపోయినట్లే . ఇన్నాళ్లు టైరు 2 హీరోలతో నటించిన కీర్తి సురేష్ ఇప్పుడు ఏకంగా గ్లోబల్ హీరోతోనే నటించే ఛాన్స్ అందుకుందని చెప్పవచ్చు .