ఆ ముగ్గురు మెగా హీరోలతో సినిమా అంటేనే దండం పెట్టేస్తోన్న జ‌క్క‌న్న‌.. షాకింగ్ రీజ‌న్‌..?

కొన్నేళ్ల క్రితం వరకు స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఇతర సాధారణ దర్శకులలో ఒకరనే సంగతి తెలిసిందే. మగధీర సినిమా నుంచి జక్కన్న స్థాయి మారిపోయింది. బిగ్ బడ్జెట్ సినిమాలకు, గ్రాఫిక్స్ ప్రధానంగా తెరకెక్కే సినిమాలకు రాజమౌళి కేరాఫ్ అడ్రస్ అయ్యారు. ఆయన సినిమాలు అంటే తొలి సీన్ నుంచి చివరి సీన్ వరకు నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయని సినిమా ఇండస్ట్రీ ప్రముఖులు సైతం భావిస్తారు.


ఎన్టీఆర్, ప్రభాస్, చరణ్ తో ఎక్కువ సినిమాలను తెరకెక్కించిన ఈ స్టార్ డైరెక్టర్ రవితేజ, సునీల్, నానిలతో కూడా సినిమాలను తెరకెక్కించారు. ఈ స్టార్ డైరెక్టర్ తర్వాత మూవీ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కనుంది. అయితే ముగ్గురు మెగా హీరోలకు స్టార్ హీరోలుగా గుర్తింపు ఉన్నా ఆ హీరోలతో పని చేయడానికి రాజమౌళి ఆసక్తి చూపడం లేదు.

ఈ హీరోలతో జక్కన్న పని చేయకపోవడానికి కారణమేంటనే ప్రశ్నకు భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. చిరంజీవి, పవన్ కళ్యాణ్, బన్నీలతో రాజమౌళి పని చేయలేదు. మగధీర సినిమాలో చిరంజీవి చిన్న పాత్రలో కనిపించినా ఆ సినిమాను చిరంజీవి- రాజమౌళి కాంబో మూవీగా భావించలేము. చిరంజీవి రాజమౌళి డైరెక్షన్ లో పని చేయడానికి ఆసక్తి చూపినా రాజమౌళి మాత్రం రిస్క్ తీసుకోవాలని భావించడం లేదు.

చిరంజీవి వయస్సు ఎక్కువ కావడంతో రిస్కీ షాట్స్ తీయడం కష్టమని.. అదే సమయంలో సీనియర్ హీరోలతో తనకు నచ్చినట్టు వర్క్ చేయించుకోవడం సులువు కాదని జక్కన్న భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ రీజన్ వల్లే చిరంజీవి- రాజమౌళి కాంబోలో సినిమా రావ‌డంలేదు. ఇక పవన్ కళ్యాణ్ తో రాజమౌళి విక్రమార్కుడు సినిమా తీయాలని భావించినా కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ సెట్ కాలేదు. ప్రస్తుతం పవన్ పాలిటిక్స్ లో బిజీగా ఉండటంతో రాజమౌళి ఈ హీరోతో పనిచేయడానికి కూడా ఆసక్తి చూపడం లేదు.

రాబోయే రోజుల్లో కూడా ఈ కాంబోలో సినిమా వచ్చే ఛాన్స్ కూడా లేదు. మరో స్టార్ హీరో అల్లు అర్జున్ తో కూడా జక్కన్న సినిమా తీయలేదు. అల్లు అరవింద్ తో రాజమౌళికి ఉన్న విభేదాలే ఇందుకు కారణమని కొంతమంది అంటున్నారు. అయితే రాజమౌళి మాత్రం బన్నీతో సినిమా చెయ్యకపోవడానికి గల కారణాన్ని ఇప్పటివరకు ఎవరితో పంచుకోలేదు.