టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ ఆటిట్యూడ్ చూపిస్తున్నాడా..? బొక్కబోర్లా పడాల్సిందేనా..?

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఇద్దరు పేర్లు మోరుమ్రోగిపోతున్నాయి . అదే ఒకరు టాలీవుడ్ స్టైలిష్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న అల్లు అర్జున్ ..మరొకరు గ్లోబల్ స్టార్ రేంజ్ లో పేరు సంపాదించుకున్న మెగా పవర్ స్టార్ రాంచరణ్ . ఇద్దరికి ఎక్కడ యవ్వారం చెడ్డిందో తెలియదు కానీ.. గత కొంతకాలంగా అల్లు ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీకి పడడం లేదు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి .

అయితే దానికి తగ్గట్టే ఇద్దరు హీరోలు కూడా ప్రవర్తిస్తూ ఉండడం అభిమానులకి మరింత కోపం తెప్పించే విధంగా మారిపోయింది . టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ తన 41 వ పుట్టినరోజును ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు . ఈ క్రమంలోనే రెండు తెలుగు రాష్ట్రాలలో అభిమానులు సందడి సందడి చేశారు . మరి ముఖ్యంగా స్టార్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అల్లు అర్జున్ కు ప్రత్యేకంగా బర్తడే విషెస్ అందించారు . అయితే రామ్ చరణ్ మాత్రం చాలా సింపుల్ గా “హ్యాపీ బర్త్డే టూ యు” అంటూ అల్లు అర్జున్ ని ట్యాగ్ చేశారు .

అదే అక్కినేని అఖిల్ పుట్టినరోజుకు మాత్రం “హ్యాపీ బర్త డే టూ యు.. మై డియర్ ” అంటూ అక్కినేని అఖిల్ ని ట్యాగ్ చేశారు . ఈ క్రమంలోనే సొంత హీరో కన్నా పక్కన హీరోకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నాడు అల్లు అభిమానులు అని ఫైర్ అవుతున్నారు. అయితే మెగా ఫ్యాన్స్ అల్లు అర్జున్ చేసిన పనిని ఎత్తిచూపుతున్నారు ..? ఈ క్రమంలోని అల్లు అర్జున్ పుష్ప సినిమా తర్వాత ఆటిట్యూడ్ చూపిస్తున్నాడని.. పుష్ప2 సినిమా గాని ఫ్లాప్ అయితే ఒక్కసారిగా బొక్క బోర్లా పడాల్సిందే అంటూ చెప్పుసొస్తున్నారు. మరికొందరు ఆర్సి 15 సినిమాతో చరణ్ కి పట్టబోయే గతి అదేగా అంటూ రివర్స్ కౌంటర్స్ చేస్తున్నారు . ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో మెగా వ్శ్ అల్లు ఫాన్స్ మధ్య వార్ పిక్స్ కి చేరుకుంది..!!