ఇండస్ట్రీ ఇలా తగలాడడానికి కారణం ఆ డైరెక్టరే .. సల్మాన్ ఖాన్ సెన్సేషనల్ కామెంట్స్..!!

తెలిసి చేశాడో .. తెలియక చేసాడో తెలియదు కానీ .. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ చేసిన హాట్ కామెంట్స్ ఇప్పుడు బాలీవుడ్ లోనే కాదు టాలీవుడ్ లోను వైరల్ గా మారాయి. మనకు తెలిసిందే.. ఈ మధ్యకాలంలో ఓటీటీలో రిలీజ్ అయిన చాలా సినిమాలు డిజాస్టర్ గా మారుతున్నాయి. అంతేకాదు సినిమా ఇండస్ట్రీలో కొత్త సినిమాలను జనాలు ఆదరించడం లేదు . బోల్డ్ కంటెంట్ ఉంటే తప్పిస్తే కుర్రాళ్ళు సినిమా థియేటర్స్ కి రానే రమ్మంటున్నారు .

దానంతటికీ కారణం రాంగోపాల్ వర్మ అంటున్నాడు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ . రీసెంట్గా మీడియాతో మాట్లాడిన బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ .. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ పై సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు . బాలీవుడ్ కాదు టాలీవుడ్ కి కూడా పరువు తీసింది రాంగోపాల్ వర్మ అని అంటూ పరోక్షంగా కౌంటర్ వేశారు . ఈ క్రమంలోనే ఆయన మాట్లాడుతూ..రామ్ గోపాల్ వర్మ ను ఏకిపారేశారు.

“ఒకప్పుడు ఓటీటీ అంటే జనాలకు మంచి కంటెంట్ దొరికేదని.. ఎప్పుడైతే రామ్ గోపాల్ వర్మ అడల్ట్ కంటెంట్ .. బోల్డ్ మూవీస్ రిలీజ్ చేసారో.. అప్పటినుంచి ఓటీటీ అంటే కేవలం బోల్డ్ గానే చూస్తున్నారని.. అందుకే మామూలు సినిమాలు ఎక్కువ రోజులు జనాలు చూడడం లేదు ” అంటూ చెప్పుకొచ్చారు. ఓటీటీ ఇలా నాశనం అయిపోవడానికి కారణం రాంగోపాల్ వర్మ అని అంటూ బల్ల గుద్ధి చెప్పేశారు . ఈ క్రమంలోని సల్మాన్ ఖాన్ మాటలు ఇండస్ట్రీలో వైరల్ గా మారాయి . చూద్దాం మరి దీనిపై రామ్ గోపాల్ వర్మ.. సల్మాన్ ఖాన్ కి ఏ విధంగా కౌంటర్ ఇస్తాడో..?