బాలీవుడ్ లో క్యూట్ కపులు గా పేరు పొందారు అభిషేక్ బచ్చన్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్ . ఈ జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఇదంతా ఇలా ఉంటే ఎంతో చూడముచ్చటగా ఉన్న ఇ జంట ఈ మధ్యకాలంలో ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. చాలా కాలం వరకు పలు కార్యక్రమాలకు పార్టీలకు ఫంక్షన్లకు ఐశ్వర్య ఒంటరిగానే వెళుతోంది లేకపోతే తన కూతుర్ని వెంటబెట్టుకొని వెళ్తోంది తప్ప ఎటువంటి ఫంక్షన్ కైనా తన కుటుంబ సమేతంగా అసలు కలిసి రాలేదు.
దీంతో అనేక రకాలుగా పలు అనుమానాలకు దారితీస్తున్నాయి.. తాజాగా ముంబైలో ముఖేష్ అంబానీ ఇంట్లో జరిగిన ఈవెంట్ కి కూడా ఐశ్వర్య, ఆరాధ్య మాత్రమే వెళ్లడం జరిగింది.. దీంతో ఆ అనుమానాలకు మరింత బలం చేకూర్చే విధంగా అయ్యిందని చెప్పవచ్చు.. ముఖేష్ అంబానీ ఇంటికి అభిషేక్ రాకపోవడంతో చాలామంది పలు రకాలుగా అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక గతంలో కూడా కొన్నిచోట్లకు కేవలం ఐశ్వర్యరాయ్ మాత్రమే వెళ్ళింది సోషల్ మీడియాలో కూడా వీరిద్దరూ విడిపోయినట్టుగా పలు వార్తలు వినిపిస్తున్నాయి.
గతంలో కూడా వీరిద్దరి మీద పలు రూమర్సు వినిపించాయి.. అమితా బచ్చన్ కుమారుడు అభిషేక్ బచ్చన్ 2007 ఏప్రిల్ 20వ తేదీన ఐశ్వర్య రాయ్ వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత 2011లో వీరికి ఆరాధ్య అనే అమ్మాయి జన్మించింది. దాదాపుగా వీరి వివాహమై ఇప్పటికి 15 సంవత్సరాలు పైనే కావస్తోంది. మరి అసలు విషయం ఏంటనేది తెలియాలి అంటే మరో కొద్ది రోజులు ఆగితే తెలుస్తుంది.ఏప్రిల్ 20వ తేదీన మ్యారేజ్ డే జరుపుకోకపోతే ఈ వార్తలు నిజమే అని చెప్పవచ్చు.