ఆ హిట్ మూవీ హిందీలో రీమేక్‌గా రిలీజ్ కానీ తెలుగు వారికే బ్యాడ్‌న్యూస్..?

బాలీవుడ్ హీరోలు హిట్స్ లేక అల్లాడిపోతున్నారు. ఈ సమయంలో వారికి రీమేక్స్ చేసుకోవడం తప్ప మిగతా ఆప్షన్ నేమీ కనిపించడం లేదు. బాలీవుడ్ హీరోలు ఇటీవల కాలంలో ‘విక్రమ్‌ వేద’, ‘భూలా’ వంటి తమిళ్ సినిమాలను రీమేక్ చేశారు. ఇప్పుడు మరో తమిళ హిట్ మూవీ బీ టౌన్‌లో రీమేక్ కావడానికి సిద్ధమైంది. ఆ మూవీ మరేదో కాదు వెంకట్‌ ప్రభు తెరకెక్కించిన ‘మానాడు’. ఇది తెలుగులో ‘ది లూప్‌’ పేరిట రిలీజ్ అయింది. రిలీజ్ టైమ్‌లో ఈ మూవీ పెద్దగా ప్రమోషన్స్‌ లేక ఆడలేదు. ఓటీటీలో మాత్రమే బాగా ఆడింది.

ఇక ఇప్పుడు ‘మానాడు’ మూవీ హిందీలో వరుణ్‌ ధావన్‌, రవితేజ తారాగణంలో రూపుదిద్దుకోవడానికి సిద్ధమైంది. రానా, ఏషియన్‌ సునీల్‌ ఈ మూవీని ప్రొడ్యూస్ చేయనుండగా.. ధర్మ ప్రొడక్షన్స్‌ డిస్ట్రిబ్యూట్‌ చేయనుందని టాక్. ఇక శింబు పాత్రలో వరుణ్‌ధావన్‌, ఎస్‌.జె.సూర్య పాత్రలో రవితేజ నటించనున్నారని సినీ వర్గాల్లో టాక్‌ నడుస్తోంది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రానున్న ఈ రీమేక్ స్క్రిప్ట్‌ వర్క్ కూడా పూర్తయిందని సమాచారం.

మరికొద్ది రోజుల్లో రవితేజ నటించిన ‘రావణాసుర’ థియేటర్లలో రిలీజ్ కానుంది. ఆపై అతని ‘ఈగల్‌’, ‘టైగర్‌నాగేశ్వరరావు’ సినిమాలు విడుదలవుతాయి. వీటి తర్వాతనే అతను మానాడు హిందీ రీమేక్ లో జాయిన్ కావచ్చు. ఇక బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో వరుణ్‌ ధావన్‌ హిందీలో ఓ మూవీ చేస్తున్నాడు. డైరెక్టర్ ప్రవీణ్ కూడా ఇప్పుడు ఖాళీగా ఏం లేడు. అతను వరుణ్‌తేజ్‌తో ఒక సినిమా రూపొందిస్తున్నాడు. ఇవన్నీ పూర్తయితే గానీ ‘మానాడు’ హిందీ రీమేక్‌ ప్రారంభం కాదని చెప్పవచ్చు.

‘మానాడు’లో ఎస్‌.జె.సూర్య డీసీపీ ధనుష్కోటి రోల్ బాగా హైలైట్ అయింది. అది రవితేజ కి బాగా సూట్ అవుతుందని భావించారు అందుకే అతనికే ఈ రోల్ ఇచ్చారు. ఇక శింబు పాత్ర ఎవరికి ఇవ్వాలా అని ఆలోచించి చించీ చివరికి వరుణ్‌ని ఎంపిక చేశారు.