బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చి.. వెండితెరపై స్టార్ హీరోయిన్లుగా ఉన్న ముద్దుగుమ్మలు వీరే..!

చిత్ర పరిశ్రమలోకి ఎలా వచ్చామన్నది ముఖ్యం కాదు ఎలా టాప్ ప్లేస్ లోకి వెళ్ళాము అనేది ముఖ్యం అని అంటున్నారు కొంతమంది హీరోయిన్లు. ముందుగా బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చి అక్కడ ప్రేక్షకులను ఆకట్టుకుని త‌ర్వాత వెండి తెరపై స్టార్ హీరోయిన్లుగా చలామణి అవుతున్న నటీమణులు చాలామంది ఉన్నారు. అలాంటి స్టార్ హీరోయిన్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

నయనతార హీరోయిన్‌గా పరిచయమవ్వడానికి ముందు సీరియల్స్ లో నటించింది.యాంకర్ గా కూడా చేసింది. ఇప్పుడు ఆమె సౌత్ ఇండియాలోనే టాప్ హీరోయిన్. సాయి పల్లవి కూడా ఢీ షో లో డాన్సర్ గా చేసిన విషయం చాలామందికి తెలుసు. అక్కడ తన ప్రతిభను చాటుకున్న సాయి పల్లవి ఆ తర్వాత మలయాళ సినిమా పరిశ్రమలో హీరోయిన్‌గా పరిచయమైంది. ఇప్పుడు తెలుగు లో కూడా టాప్ హీరోయిన్‌గా మారింది సాయి పల్లవి.

Sai Pallavi Vs Keerthy Suresh: Who Stabs Hearts With Their Traditional  Gajras? | IWMBuzz

టాలీవుడ్ మహానటి కీర్తి సురేష్ కూడా మొదటగా సీరియల్స్ లోనే నటించింది. ఆమె తల్లి కూడా నటి కావడంతో హీరోయిన్‌గా ఆమె ఎదిగింది. ఇక మరో మలయాళ ముద్దుగుమ్మ నజ్రియా ఓ మలయాళ ఛానల్ లో యాంకర్ గా తెరంగేట్రం చేసింది. అంతకు ముందు బాలనటిగా కూడా చేసింది. ఆమె ఇప్పుడు తెలుగులో కూడా సినిమాలు చేయడం మొదలు పెట్టింది. మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ ను వివాహం చేసుకుంది.

ఇక గ‌త సంవ‌త్స‌రం తెలుగులో సూపర్ హిట్ అయిన సినిమా సీతారామంలో హీరోయిన్‌గా నటించిన మృణాల్ ఠాకూర్ కూడా ముందుగా బుల్లితెరపై పరిచయమైంది. కుంకుమ భాగ్య అనే సీరియల్ లో చేసిన ఈమెకు మంచి పేరు రాగా.. ఇప్పుడు ఆమె తెలుగుతో పాటు బాలీవుడ్‌లో కూడా మంచి సినిమా అవకాశాలను అందుకుంటుంది.