ఏపీ సీఎం పై సంచలన పోస్ట్ చేసిన శ్రీరెడ్డి..?

నటి శ్రీరెడ్డి ఎప్పుడూ కూడా సినీ ఇండస్ట్రీలో ఉండే క్యాస్టింగ్ కౌచ్ పైన స్పందిస్తూ ఉంటుంది. ఇక అంతే కాకుండా అప్పుడప్పుడు రాజకీయాలలో కూడా చురుకుగా ఉంటూ వ్యవహరిస్తూ ఉంటుంది. ముఖ్యంగా అధికార పార్టీ వైయస్ జగన్ పార్టీకి సపోర్ట్ చేస్తూ వ్యవహరిస్తూ ఉంటుంది శ్రీరెడ్డి. ఇక గత ఎన్నికలలో ఘోరమైన పరాజయాన్ని చూసిన టిడిపి తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు కాస్త ఊరటనీచ్చాయని చెప్పవచ్చు. దీంతో టిడిపి అభిమానులలో కూడా కాస్త ఆనందం కనిపిస్తోంది.. కానీ అధికార పార్టీ మాత్రం 175 స్థానాలు ఈసారి మావే అంటు చాలా ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Actress Sri Reddy surprises everyone with comments on YS Jagan Mohan Reddy  | Hyderabad News - Times of India
ఇక వైసిపి పార్టీలో ఉంటూ ప్రతిపక్షానికి సపోర్ట్ చేసిన నలుగురు ఎమ్మెల్యేలను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. అందులో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ,మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ,ఆనం నారాయణరెడ్డి ,ఉండవల్లి శ్రీదేవి ఈ నేపథ్యంలో ఈ నలుగురు ఎమ్మెల్యేలను విషపురుగులతో పోలుస్తూ ఆసక్తికరమైన పోస్ట్ చేసింది శ్రీరెడ్డి.. శ్రీ రెడ్డి ఇలా పోస్ట్ చేస్తూ మీ ఆశయాలు మీద నమ్మకంతో మీరేమి ఇవ్వకున్నా మీ మీద ప్రేమతోనే నడిచే వాళ్ళ మేమంతా ఉన్నాము విషపురుగులు విషమే తప్ప అమృతాన్ని కురిపిస్తాయా జగనన్న.. పదవి ,కోట్లు ఇవ్వకుండా మిమ్మల్ని నమ్మి కోట్లాదిమంది ప్రజలు ఉన్నారు.. చంద్రబాబును నమ్మి ఇలాంటి విషపురుగులు మాత్రమే ఉంటాయి జై జగన్ అంటూ పోస్టు షేర్ చేసింది శ్రీరెడ్డి..

ఇదంతా ఇలా ఉంటే ..శ్రీరెడ్డి వైసీపీకి అనుకూలంగా పోస్టు పెడుతుందని కానీ ఆమెకు పార్టీలో ఎలాంటి ప్రాధాన్యత లేదని చెప్పవచ్చు. కానీ ప్రచారంలో మాత్రం చంద్రబాబు పవన్ కళ్యాణ్ లను తిడుతూ ఉంటుంది శ్రీరెడ్డి. ప్రస్తుతం శ్రీరెడ్డి షేర్ చేసిన ఫోటో వైరల్ గా మారుతోంది.