వీరయ్య కంటే వీర సింహారెడ్డి తోపా.. అక్కడ కూడా డామినేట్ చేశాడుగా..!

టాలీవుడ్ లో సంక్రాంతి సినిమాల హడావుడి మొదలైంది. ఇక ఇప్పటికే ఈ సినిమాల ప్రమోషన్స్ తో సోషల్ మీడియా హోరెత్తిపోతుంది. ఇక తెలుగు స్టార్ హీరోలైన‌ చిరంజీవి- బాలకృష్ణ మళ్లీ 5 సంవత్సరాల తర్వాత సంక్రాంతి పోటీలో తమ సినిమాలతో రావటంతో ఇటు వారి అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇక బాలకృష్ణ ముందుగా వీర సింహారెడ్డి సినిమాతో జనవరి 12న ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాడు. ఇక ఆ తర్వాత రోజు జనవరి 13న చిరంజీవి వాల్తేర్ వీరయ్య సినిమాతో వస్తున్నాడు.

ఇక ఇప్పటికే ఈ సినిమాల నుంచి వచ్చిన టీజర్, సాంగ్స్ తో ప్రేక్షకులలో భారీ స్థాయిలో అంచనాలు పెరిగిపోయాయి. ఇప్పటికే ఈ రెండు సినిమాలు కూడా రిలీజ్ కి సంబంధించిన అన్ని పనులను పూర్తి చేసుకున్నాయి. ఇక తాజాగా ఈ రెండు సినిమాలకు సెన్సార్ వర్క్ కూడా పూర్తయింది ఈ రెండు సినిమాల రన్ టైం కూడా లాక్ చేశారు. చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాకు రెండు గంటల 40 నిమిషాల రన్ టైమ్‌ లాక్ చేయగా. బాలయ్య వీర సింహారెడ్డికి ఏకంగా రెండు గంటల 49 నిమిషాల రన్ టైం లాక్ చేశారు.

ఇక రన్ టైం పరంగా వీరయ్య కంటే వీర సింహారెడ్డినే పదినిమిషాలు ఎక్కువ. అయితే ఈ రెండు సినిమాలకు క్రిస్ప్ రన్ కాకుండా కాస్త ఎక్కువ లెన్త్ ఫిక్స్ చేయడంతో కొత్త చర్చ నడుస్తుంది.ఈ మాస్‌ యాక్షన్ సినిమాలకు రెండున్నర గంటలు కాకుండా మరో 10, 20 నిమిషాలు ఎక్కువ రన్ టైమ్‌ తీసుకుని దర్శకులు బాబీ- గోపీచంద్ ప్రేక్షకులను ఇబ్బంది పెడతారా.. అనే సందేహాలు కూడా వస్తున్నాయి.

రన్ టైమ్‌ ఎక్కువ ఉండటం వల్ల ఈ మధ్య కొన్ని సినిమాలు ప్రేక్షకులను బాగా బోర్ కొట్టించి థియేటర్ నుంచి బయటకు పంపించాయి. వీరయ్య , వీర సింహా రెడ్డి లకు సంబందించి మేకర్స్ ఈ రన్ టైమ్ లాక్ చేసుకునే ముందు అవన్నీ ఆలోచించే ఉంటారు. ఫైనల్ గా కథ డిమాండ్ చేస్తే పరవాలేదు.. కానీ ఊరికే డ్రాగ్ చేసి లెంగ్త్ పెంచితే మాత్రం మొదటికే మోసం వస్తుంది.