నవరంధ్రాలు మూసుకుని ఉన్నారా..? మెగా హీరోస్ పై దారుణమైన ట్రోలింగ్ ..కారణం ఇదే..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ప్రతి చిన్న విషయాన్ని రాద్దాంతం చేస్తూ భూత అద్దంలో పెట్టి చూడడం అలవాటుగా మారిపోయింది . పెద్ద విషయంపై ఏ విధంగా ట్రోల్ చేస్తున్నారో .. చిన్న విషయాన్ని కూడా అదే రేంజ్ లో పట్టుకొని లాగి సాగదీసి మరి స్టార్ హీరోస్ కి మెలిపెడుతూ ఇండస్ట్రీలో పరువు ప్రతిష్టలు ఉన్న కొందరు హీరోస్ ను కావాలనే టార్గెట్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు కొందరు ట్రోలర్స్.

రీసెంట్గా అయ్యప్ప స్వామి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బైరి నరేష్ ని పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేసి జైలుకు తరలించిన విషయం తెలిసిందే . ఆ వివాదం ఇంకా చల్లారలేదు. హిందూ దేవుళ్ళపై ఇలా నోటికొచ్చిన అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను అయ్యప్ప స్వాములు, హిందూ సంఘాలు పలువురు స్టార్ సెలబ్రిటీస్, రాజకీయ నేతలను , సినీ ప్రముఖుల పై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ కూడా ఈ ఇష్యూ పై స్పందించకపోవడంతో బిజెపి స్టేట్ చీఫ్ బండి సంజయ్ ట్విట్టర్ వేదికగా ఆయనపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు .

కాగా నిజమైన హిందువు అని చెప్పుకొని తిరిగే సీఎం కేసీఆర్ ఈ ఘటనపై ఎందుకు రియాక్ట్ అవ్వడం లేదు అంటూ సూటిగా ప్రశ్నించారు . ఈ ఘటనపై స్పందించకపోవడంతో పలువురు సినీ స్టార్స్ ను కూడా ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్ . సినిమా ఇండస్ట్రీలో అయ్యప్ప స్వామి మాలను వేసిన కొందరు స్టార్ హీరోస్ ను టార్గెట్గా చేస్తూ ట్రోలర్స్ ఘాటు గా ట్రోల్ చేస్తున్నారు. తమ వ్యక్తిగత స్వార్థం కోసమే అయ్యప్ప స్వామి మాలను ధరిస్తున్నారని.. వాళ్లకు నిజమైన ప్రేమ లేదని మండిపడుతున్నారు .

అంతేకాదు ఈ మేరకు మెగాస్టార్ చిరంజీవి , మంచు మనోజ్ , యంగ్ టైగర్ ఎన్టీఆర్ , హీరో రామ్ చరణ్ అయ్యప్ప స్వామి మాల ను వేసుకున్న ఫొటోస్ సోషల్ మీడియాలో ట్యాగ్ చేస్తూ ఘాటు పదాజాలంతో దూషిస్తున్నారు. ” మెగాస్టార్ గారికి గరికిపాటి విషయంలో ఉన్న శ్రద్ధ అయ్యప్ప స్వామి విషయంలో లేదని “మండిపడుతుంటే ..మరి కొందరు “అయ్యప్ప స్వామిని బహిరంగంగా దూషించినా నవరంధ్రాలు మూసుకొని ఉన్నారు. ఎందుకంటే ఫాన్స్ హర్ట్ అయిపోతారని “అంటూ ఘాటుగా కామెంట్స్ చేస్తున్నారు . ఈ క్రమంలోనే ఈ వివాదం నెట్టింట చర్చనీయాంశంగా మారింది.