మెగా నందమూరి ఫ్యాన్స్ హ్యాపీగా లేరా..?

చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య ,బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమాలు ఈ సంక్రాంతికి పోటీ పడుతున్నాయి. గత కొంతకాలంగా సంక్రాంతి సమరం అనేది ఎక్కువగా జరుగుతోందని వార్తలు వినిపిస్తున్నాయి. దాదాపుగా 8 సంవత్సరాల విరామం తర్వాత ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు పోటీ పడడం జరుగుతోంది. ఈ ఇద్దరిలో బాలకృష్ణ యాక్షన్ డ్రామా సినిమా జనవరి 12న రాబోతుండగా మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమా 13వ తేదీ విడుదల కాబోతోంది. ఇద్దరు అగ్ర కథానాయకులు కావడంతో ఈ సినిమాలు భారీగానే పోటీగా విడుదల కాబోతున్నాయి.

Here's The List Of Tollywood Films That Will Be Releasing For Sankranthi  2023 - Filmibeatముఖ్యంగా ప్రమోషన్ పనులలో కూడా భారీగానే క్రేజ్ మొదలైంది. ఈ చిత్రాన్ని నిర్మించింది కూడా ఒకే సంస్థ అదే మైత్రి మూవీ మేకర్స్. చిరంజీవి, బాలయ్య గత కొన్నేళ్లుగా మంచి స్నేహితులుగా ఉన్నారని వార్తలు వినిపిస్తూ ఉంటాయి. అయితే ఇది వీరి సినిమాల మధ్య మాత్రం లేదనే విషయాలు వినిపిస్తూ ఉన్నాయి. మైత్రి మూవీస్ వారు కూడా ఈ రెండు సినిమాలకు ఎక్కడ తగ్గకుండా రెండిటిని సమాన ప్రాధాన్యత నేస్తూ ప్రమోషన్స్ ని కూడా బాగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక బాలయ్య సినిమా పాటలను ఏ రేంజ్ లో విడుదల చేస్తున్నారో అదే రేంజ్ లో కూడా చిరంజీవి పాటలను విడుదల చేస్తూ ఉన్నారు చిత్ర బృందం.

మామూలుగా ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు ఒకే సమయంలో విడుదలవుతున్నాయి అంటే ఫ్యాన్స్ హంగామా చాలా ఉంటుంది. అయితే ఏ హీరో విషయంలో అయినా కాస్త పట్టుతప్పారని తెలిస్తే అభిమానులు ఒక రేంజ్ లో మేకర్స్ పైన ట్రోల్ చేస్తూ ఉంటారు. కానీ బాలకృష్ణ వీరసింహారెడ్డి చిరంజీవి వాల్తేర్ వీరయ్య సినిమా ప్రమోషన్స్ లో మాత్రం అభిమానులు ఫుల్ ఖుషి గా ఉన్నట్లు ఇన్సైడ్ టాక్ వినిపిస్తోంది. మరి ఈ సినిమాలో ఎలా ఆకట్టుకుంటాయి చూడాలి.