ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి `వాల్తేరు వీరయ్య` సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. బాబీ దర్శకత్వం వహించిన ఈ మాస్ ఎంటర్టైనర్ లో మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రను పోషించాడు. శ్రుతిహాసన్, కేథరిన్ హీరోయిన్లుగా నటించారు. సంక్రాంతి కానుకగా జనవరి 13న ఈ సినిమా విడుదల కాబోతోంది.
అయితే చిరంజీవితో పాటు ఆయన తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైతం సంక్రాంతికి సందడి చేసేందుకు వస్తున్నాడు. ఇంతకీ విషయం ఏంటంటే.. ఇటీవల పవన్ కళ్యాణ్ నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న `అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే` టాక్ షోలో గెస్ట్ గా హాజరైన సంగతి తెలిసిందే. ఆ షో షూట్ కూడా పూర్తయింది. పవన్తో పాటు స్టార్ డైరెక్టర్స్ త్రివిక్రమ్, క్రిష్లు కూడా బాలయ్య షోలో పాల్గొన్నారు.
ఈ ఎపిసోడ్ కోసం అభిమానులతో పాటు ప్రేక్షకులు ఎంతో ఆతృతగా చూస్తున్నారు. అయితే పవన్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కు ఆహా టీమ్ ముహూర్తం పెట్టేసిందట. సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 13న పవన్ ఎపిసోడ్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రానుందని అంటున్నారు. ఇదే కనుక జరిగితే మెగా అభిమానులకు డబుల్ ట్రీట్ ఖాయం అవుతుంది.