సంక్రాంతి దగ్గర పడటంతో ఇప్పటికే టాలీవుడ్ లో సినిమాల హడావుడి మొదలైంది. ఈ సంక్రాంతికి తెలుగు సీనియర్ హీరోలైన బాలకృష్ణ, చిరంజీవి తమ సినిమాలతో థియేటర్లో సందడి చేయబోతున్నారు. చిరంజీవి దర్శకుడు బాబి దర్శకత్వంలో నటిస్తున్న వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ మాస్ దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటిస్తున్న వీరసింహారెడ్డి. ఈ రెండు సినిమాలు కూడా సంక్రాంతికి ఒక్కరోజు వ్యవధిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఈ సినిమాలను టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు.
ఇక ఈ సీనియర్ హీరోలకు జంటగా అందాల భామ శృతిహాసన్ నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమాల నుంచి విడుదలైన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. రెండు రోజుల్లో ఈ సినిమాలుకు సంబంధించిన ట్రైలర్ కూడా విడుదల కానుంది. ఈ రెండు సినిమాలకు తెలుగు రాష్ట్రాల్లో 1300ల థియేటర్లో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా తెలుస్తుంది. ఇప్పటికే ఓవర్సీస్ లో ఈ సినిమాల బుకింగ్స్ మొదలు కాగా బాలయ్య వీరసింహారెడ్డికి ఎవరో ఊహించని స్థాయిలో బుకింగ్ వస్తున్నాయి.
ఈ క్రమంలోనే 2020వ సంవత్సరంలో ఒక్కరోజు గ్యాప్ లో విడుదలైన మహేష్ సరిలేరు నీకెవ్వరు, బన్నీ అల వైకుంఠపురం సినిమాలు ఆ సంవత్సరం సంక్రాంతి విన్నర్ గా నిలిచి ఒక్కదాని మించి మరొకటి సూపర్ హిట్ సినిమాలుగా నిలిచాయి. ఇక ఇప్పుడు వచ్చే సంక్రాంతికి కూడా వీర సింహారెడ్డి, వాల్తేర్ వీరయ్య సినిమాలు అదే మ్యాజిక్ ను రిపీట్ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ రెండు సినిమాలకు హిట్ టాక్ వస్తే మాత్రం ఈ సినిమాలతో పాటు విడుదల కానున్న కోలీవుడ్ డబ్బింగ్ మూవీస్ వారసుడు, తెగింపు సినిమాలకు మాత్రం పెద్ద దెబ్బే అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
మన తెలుగు రాష్ట్రాల్లో డబ్బింగ్ సినిమాలకు మంచి టాక్ వచ్చినా తెలుగు సినిమాలకు ఇచ్చిన ప్రాధాన్యత వాటికి ఎవరనే విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు బాలకృష్ణ- చిరంజీవి 2020 సంక్రాంతి మ్యాజిక్ ను ఈ సంవత్సరం కూడా రిపీట్ చేస్తారో లేదో చూడాలి. ఒకవేళ ఇద్దరు హీరోలు రిపీట్ చేస్తే మాత్రం బాక్సాఫీస్ వద్ద ఎవరు ఊహించిన స్థాయిలో రికార్డులు సొంతం చేసుకోవడం గ్యారెంటీ అనే కామెంట్లు కూడా వస్తున్నాయి.