నేషన్స్‌ బెస్ట్ ఫెయిర్.. ప్ర‌భాస్‌-అనుష్క‌పై ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ కామెంట్స్ వైర‌ల్‌!

టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి గురించి ప్రత్యేక పరిచయాలు చేయనవసరం లేదు. వీరిద్దరి కాంబినేషన్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. ఇక ఈ క్రమంలోనే ప్రభాస్-అనుష్క ప్రేమించుకుంటున్నారని, వీరిద్దరూ కలిసి కొంతకాలంగా సహజీవనం కొనసాగిస్తున్నారని.. అంతేకాకుండా త్వరలోనే పెళ్లి పీటలు కూడా ఎక్కబోతున్నారని.. ఇలా ఒక్కటేమిటి ఎన్నో వార్తలు వినిపించాయి.

అయితే తాజాగా వీరిద్దరి రిలేషన్షిప్ గురించి ప్ర‌ముఖ డైరెక్టర్ మెహర్ రమేష్ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టాడు. మెహర్ రమేష్ డైరెక్షన్లో వచ్చిన `బిల్లా` సినిమాలో ప్రభాస్, అనుష్క జంటగా నటించిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ టైంలో ఈ జంటని దగ్గర నుండి చూసిన మెహర్ రమేష్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వీరిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

 

`అరుంధతి` సినిమాలో జేజమ్మ లాంటి గొప్ప క్యారెక్టర్ చేసి..ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిన తర్వాత `బిల్లా` సినిమాలో ప్రభాస్ కి జోడిగా బికినీ వేసుకుని మళ్లీ గ్లామర్ సైడు వచ్చి మరో హిట్ సినిమాని తన ఖాతాలో వేసుకుంది అనుష్క. అయితే `బిల్లా` సినిమా షూటింగ్ సమయంలో సరదాగా “బొమ్మాళీ నిన్ను వదలా బొమ్మాళీ“ అంటూ పాడిన మహేర్ రమేష్ ఇదే మన పాట అని ప్రభాస్ అనుష్కలకు చెప్పాడట. కానీ వారిద్దరూ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోలేదని.. మణిశర్మ తో కలిసి ఆ సాంగ్ ని సింగర్ తో రాయించినట్లు మెహర్ రమేష్ పాత జ్ఞాపకాలను మరల గుర్తు చేసుకున్నాడు.

ప్రభాస్ అనుష్క కెమిస్ట్రీ గురించి చెప్పాలంటే ఆ ఇద్దరూ `నేషన్స్ బెస్ట్ పెయిర్` అని ఆయన పేర్కొన్నారు. `బిల్లా` సినిమా ఒక్కటే కాదు ఆ తర్వాత వచ్చిన `మిర్చి`, `బాహుబలి 1`, `బాహుబలి 2` లో కూడా వారిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ బాగా వర్క్ అయిందంటూ మెహర్ ఆ ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చాడు. అయితే ప్రభాస్ అనుష్కపై మెహర్ రమేష్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.