అక్కినేని హీరో కు ఘోర అవమానం.. ఈ దెబ్బతో ఉన్న పరువు మొత్తం పాయే..!

ప్రస్తుతం కొంతమంది హీరోలు తమ మార్కెట్ కోల్పోయి చాలా కాలమవుతుంది. అయినప్పటికీ వచ్చిన అడపాదడపా సినిమాలను చేసుకుంటూ అప్పుడప్పుడు సక్సెస్ను చూస్తున్నారు. అయితే హీరో సుమంత్ కూడా అదే కోవకు చెందుతాడు. హీరో సుమంత్ కూడా తన మార్కెట్ కోల్పోయి చాలా రోజులవుతుంది.

అప్పుడెప్పుడో వచ్చిన `మళ్లీ రావా` సినిమాతో సక్సెస్ ను సాధించిన సుమంత్ ఆ తర్వాత ఎలాంటి విజయాన్ని చేరుకోలేక పోయాడు. ఇటీవల `సీతారామం` సినిమాతో విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమాలో బ్రిగేడియర్ విష్ణుశర్మగా నెగటివ్ షేడ్స్ తో కూడిన క్యారెక్టర్ లో కనిపించి ప్రేక్షకులను మెప్పించాడు. అయితే ఈ సినిమా సక్సెస్ ఖాతాలో పడినప్పటికీ సుమంత్ మార్కెట్ ఏమాత్రం పెంచుకోలేకపోయాడు.

తాజాగా సుమంత్ హీరోగా నటించిన సినిమా `వాల్తేరు శీను`.. క్రైమ్, కామెడీ జోనర్ తో తెరకెక్కిన ఈ సినిమాకు ఫ్రీ రిలీజ్ బిజినెస్ ఏ మాత్రం జరగడం లేదు. మూవీ మేకర్స్ ఎంత ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా నాన్ థియేటర్ బిజినెస్ క్లోజ్ చేయలేకపోతున్నారు. అటు డిస్ట్రిబ్యూషన్ పరంగా కూడా ఈ సినిమాకు పెద్దగా ఆఫర్లు రావడం లేదని సమాచారం. ఇక ఈ విషయం తెలిసిన కొందరు అక్కినేని హీరోకి ఘోర అవమానం అంటూ.. ఈ దెబ్బకు ఉన్న పరువు మొత్తం పాయే అని వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏదేమైనాప్పటికీ సుమంత్ తన కెరీర్ పై పూర్తి అవగాహన, స్పష్టత ఉందంటూ కేవలం హీరో పాత్రలకు మాత్రమే పరిమితం కానని సీతారామంలో నటించిన విలక్షణ పాత్రలు వస్తే తప్పకుండా చేస్తానని ప్రకటించాడు. ప్రస్తుతం సుమంత్ సినిమాకు జీరో మార్కెట్ జరగడం విషయం వైరల్ గా మారుతుంది.