మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబోలో తెరకెక్కిన చిత్రమే `ఆచార్య`. ఈ మూవీలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించగా.. రామ్ చరణ్, పూజా హెగ్డేలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న గ్రాండ్గా విడుదల కాబోతోంది.
ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, ఫస్ట్ సింగిల్కి మంచి రెస్పాన్స్ రాగా.. ఆచార్య మేకర్స్ తాజాగా సెకెండ్ సింగిల్పై కూడా అప్డేట్ ఇచ్చేశారు. పూజా హెగ్డే- రామ్ చరణ్ ల పై చిత్రీకరించిన `నీలాంబరి` అనే లిరికల్ సాగ్ను సెకెండ్ సింగిల్గా ఈ నెల 5న ఉదయం 11:07 నిమిషాలకు విడుదల చేయబోతున్నారు.
ఈ మేరకు ఓ అద్భుతమైన పోస్టర్ను కూడా వదిలారు. ఈ పోస్టర్లో పూజా చేతిలో పిల్లనగ్రోవి పట్టుకోగా, ఆమెను చరణ్ వెనకాల నుంచి గాఢంగా హత్తుకుని రొమాంటిక్గా కనిపించాడు. ఆకట్టుకుంటున్న ఈ పోస్టర్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. కాగా, ఈ చిత్రంలో చరణ్ సిద్ధ పాత్రలో కనిపించబోతుండగా.. పూజా నీలాంబరి రోల్ పోషించబోతోన్న సంగతి తెలిసిందే.