పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా `రాధేశ్యామ్` చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇదిలా ఉంటే.. గత కొద్ది రోజులుగా ఓ టాక్ ఫిల్మ్ సర్కిల్లో తెగ చక్కర్లు కొడుతుంది. ఇంతకీ విషయం ఏంటంటే.. ప్రభాస్, పూజా హెగ్డేల మధ్య విభేదాలు చోటుచేసుకున్నాయట.
పూజా హెగ్డేపై ప్రభాస్ మరియు రాధేశ్యామ్ యూనిట్ గుర్రుగా ఉన్నారట. ఇందుకు కారణం పూజా తీరేనట. సెట్లో పూజా తీరు ఏ మాత్రం బాగోలేదట, టాప్ హీరోయిన్ అన్న ఈగోతో ఆమె ప్రవర్తిస్తుందట. అందుకే ఎంతో కూల్గా ఉండే ప్రభాస్ మరియు యూనిట్ ఆమెపైగా ఆగ్రహంగా ఉన్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది.
అంతేకాదు, ప్రభాస్-పూజా హెగ్డే మధ్య ఉండాల్సిన సీన్లను సైతం రాధేశ్యామ్ టీం విడివిడిగా చిత్రీకరించిందని వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఈ వార్తలపై చిత్రయూనిట్ స్పందించింది. వారిద్దరి మధ్య ఎటువంటి విభేదాలు లేవని మేకర్స్ తెలిపారు. అలాగే పూజా మంచి టైమ్ సెన్స్ పాటిస్తుందని..అందువల్ల, ఆమెతో పని చేయడం ఎంతో సులువైందని చెప్పుకొచ్చారు.