ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న `ఆర్ఆర్ఆర్` చిత్రంతో బిజీగా ఉన్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ఆ తర్వాత ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్తో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించబోతున్న ఈ పాన్ ఇండియా చిత్రంలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది.
సెప్టెంబర్ నుంచి సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ చిత్రం గురించి ఓ క్రేజీ న్యూస్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్గా మారింది. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే.. ఈ చిత్రంలో విలన్గా మాలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ నటించబోతున్నాడట. పొలిటికల్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కబోతున్న ఈ చిత్రంలో విలన్ పాత్ర హీరోతో నువ్వా? నేనా? అన్నట్టు ఉంటుందట.
అటువంటి పాత్రలో ఫాజిల్ కరెక్ట్ సరిపోతాడని భావించిన మేకర్స్.. ఆయనను సంప్రదించగా వెంటనే ఓకే చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. ఇదే నిజమైతే త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన రానుంది. కాగా, బన్నీ హీరోగా తెరకెక్కుతున్న పుష్పలోనూ ఫహద్ ఫాజిల్నే విలన్గా నటిస్తున్నాడు. ఇక ఇప్పుడు చరణ్ కూడా ఆయనకు ఫిక్స్ అయినట్టు టాక్ బలంగా వినిపిస్తోంది.