నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన తాజా చిత్రం `లవ్స్టోరీ`. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్లో శ్రీ నారాయణదాస్ నారంగ్ & శ్రీ పి. రామ్ మోహన్ రావు నిర్మించారు. అయితే నిజానికి ఈ చిత్రం ఏప్రిల్ 2న విడుదల కావాల్సి ఉండగా, కరోనా సెకండ్ వేవ్ అడ్డుపడింది.
ఇక ప్రస్తుతం కరోనా ఉధృతి తగ్గుతోంది. థియేటర్లు ఓపెన్ అయ్యాయి. చిన్న చిన్న సినిమాలు వరుసపెట్టి విడుదల అవుతుండడంతో.. లవ్స్టోరీ రిలీజ్ డేట్ ఎప్పుడు ప్రకటిస్తారా అని అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. మరోవైపు వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 10వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలని మేకర్స్ ఓ అభిప్రాయానికి వచ్చారని టాక్ నడించింది.
అయితే అనుకున్నదే జరిగింది. తాజాగా మేకర్స్ లవ్స్టోరీని వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 10న విడుదల చేయబోతున్నామని తెలుపుతూ న్యూ పోస్టర్ను విడుదల చేశారు. ఈ పోస్టర్లో చైతు, సాయి పల్లవి ఎంతో ఉత్సాహనంగా పరిగెడుతూ కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది.