వైసీపీలోకి మాజీ సీఎం ఫ్యామిలీ… ఎంపీ-ఎమ్మెల్యే సీటు ఆఫ‌ర్‌

ఏపీలో విప‌క్ష వైసీపీకి ఇప్పుడిప్పుడే మంచి జోష్ వ‌స్తోంది. అమ‌రావ‌తిలో జ‌రిగిన ప్లీన‌రీ త‌ర్వాత ఆ పార్టీ అధినేత జ‌గ‌న్ ప్ర‌క‌టించిన ప‌లు ప‌థ‌కాలు కాస్త ఆక‌ర్ష‌ణీయంగా ఉండ‌డంతో ఇప్పుడు ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో వాటి గురించే చ‌ర్చ జ‌రుగుతోంది. ఇదిలా ఉంటే వైసీపీలో మ‌రో ప్ర‌ముఖ రాజ‌కీయ కుటుంబం ఎంట్రీ ఇవ్వ‌నుంద‌ని తెలుస్తోంది. క‌ర్నూలు జిల్లా రాజ‌కీయాల్లో సుదీర్ఘ‌కాలంగా ఎంతో ప‌ట్టున్న మాజీ సీఎం కోట్ల విజ‌య‌భాస్క‌ర్‌రెడ్డి ఫ్యామిలీ వైసీపీలోకి వెళ్లేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ట‌. కోట్ల […]

చంద్ర‌బాబు తీరుతో నేత‌ల్లో ఆందోళ‌న‌

పార్టీ కోసం ఎక్కువ స‌మ‌యాన్ని కేటాయిస్తాన‌ని సీఎం చంద్ర‌బాబు ప‌దేప‌దే చెబుతున్నా.. ఆచ‌ర‌ణ‌లో మాత్రం వాటిని ప‌ట్టించుకోవ‌డం లేదా? సుదీర్ఘంగా ఆలోచించి నిర్ణ‌యాలు తీసుకోవ‌డంలో ఏర్ప‌డుతున్న జాప్యం వ‌ల్ల పార్టీకి కొంత న‌ష్టం క‌లుగుతోందా? అంటే అవున‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. ముఖ్యంగా క‌ర్నూలు జిల్లాకు చెందిన శిల్పా మోహన్‌రెడ్డి టీడీపీని వీడి వైసీపీలో చేరిన త‌ర్వాత‌.. పార్టీ శ్రేణుల్లో ఈ అంశాలపై విస్తృత‌మైన చ‌ర్చ జ‌రుగుతోంది. ముఖ్యంగా మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ త‌ర్వాత‌.. పార్టీలో అసంతృప్తుల సంఖ్య […]

నంద్యాల రాజ‌కీయం మ‌ళ్లీ యూట‌ర్న్‌..!

ఏపీలోని క‌ర్నూలు జిల్లా నంద్యాల నియోజ‌క‌వ‌ర్గ రాజ‌కీయం ఏ రోజు ఎలా మ‌లుపులు తిరుగుతుందో ఎవ్వ‌రూ ఊహించ‌లేక‌పోతున్నారు. వాస్త‌వానికి ఈ నియోజ‌క‌వ‌ర్గంలో గ‌త ప‌దేళ్ల‌లో చాలా మంది నాయ‌కులు పార్టీలు ఫిరాయించారు. ఇక్క‌డ గ‌త ఎన్నిక‌ల్లో గెలిచిన భూమానే తీసుకుంటే ఆయ‌న టీడీపీ – ప్ర‌జారాజ్యం – వైసీపీ తిరిగి టీడీపీ ఇలా చాలా పార్టీలు మారారు. గ‌త ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన భూమా నాగిరెడ్డి మంత్రి ప‌ద‌వి హామీతో టీడీపీలోకి జంప్ చేశారు. రెండు […]

ల‌గ‌డ‌పాటి స్కెచ్ టీడీపీ ఎంపీకా..వైసీపీ ఎమ్మెల్యేకా..!

ద‌శాబ్దం పాటు ఏపీలో కీల‌క‌మైన కృష్ణా జిల్లా రాజ‌కీయాల‌ను శాసించిన విజ‌య‌వాడ మాజీ ఎంపీ ల‌గ‌డ‌పాటి రాజ్‌గోపాల్ గ‌త ఎన్నిక‌లకు ముందు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభ‌జ‌న చేయ‌డంతో రాజ‌కీయాల‌పై విర‌క్తితో ఆయ‌న వాటికి దూర‌మ‌య్యారు. ప‌దేళ్ల‌పాటు విజ‌య‌వాడ ఎంపీగా ఉన్న ల‌గ‌డ‌పాటి ఇటు స్టేట్ పాలిటిక్స్‌లో కింగ్‌. అటు జాతీయ‌స్థాయిలోను స‌త్తా చాటారు. మీడియాలో ఎక్క‌డ చూసినా ల‌గ‌డ‌పాటి హంగామా చాలా ఎక్కువ‌గానే ఉండేది. అలాంటి ల‌గ‌డ‌పాటి వాయిస్ ఇప్పుడు చాలా త‌క్కువుగా మాత్ర‌మే వినిపిస్తోంది. […]

వైసీపీ సిట్టింగుల‌లో 16 మందికి టిక్కెట్లు లేవా

ఏపీలో 2019 ఎన్నిక‌ల్లో గెలుపు కోసం ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ త‌న ప‌ని అప్పుడే స్టార్ట్ చేసేశాడు. ఇప్ప‌టికే వైఎస్‌.జ‌గ‌న్‌ను హైద‌రాబాద్ నుంచి విజ‌య‌వాడ‌కు మకాం మార్చేయాల‌ని చెప్పిన ప్ర‌శాంత్ ప్ర‌స్తుతం వైసీపీకి ఉన్న ప్ర‌జాప్ర‌తినిధుల్లో తీవ్ర వ్య‌తిరేక‌త ఎదుర్కొంటోన్న వారిలో కొంద‌రికి టిక్కెట్లు ఇవ్వ‌కూడ‌ద‌ని కూడా జ‌గ‌న్‌కు ప్రాధ‌మిక నివేదిక ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. ప్ర‌శాంత్ ప్రాధ‌మిక నివేదిక‌లో ఇద్ద‌రు సిట్టింగ్ ఎంపీల‌ను ప‌క్క‌న పెట్టేయాల‌ని జ‌గ‌న్‌కు చెప్పిన‌ట్టు ఇప్ప‌టికే వార్త‌లు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. తిరుప‌తి […]

వైసీపీలో ప్ర‌శాంత్ కిషోర్ ప‌ని స్టార్ట్‌! అన్ని మార్చాల్సిందే..

ఎప్పుడెప్పుడా అని వైసీపీ కార్య‌క‌ర్త‌లు, నేత‌లు ఎదురు చూస్తున్న ఏపీలో వైసీపీ కార్యాల‌యం ఏర్పాటు ప్ర‌క్రియ ప‌ట్టాల‌మీద‌కి ఎక్కింది. రాబోయే రెండు మూడు నెల‌ల్లోనే కార్యాల‌యం అందుబాటులోకి రానుంది. 2019లో జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల్లో ఎట్టి ప‌రిస్థితిలోనూ పార్టీని అధికారంలోకి తీసుకురావాల‌ని వెయ్యి ప్ర‌ణాళిక‌ల‌తో ముందుకు వెళ్తున్న జ‌గ‌న్‌.. మోడీకి ఎన్నిక‌ల ప్లాన్ ఇచ్చి.. అధికారంలోకి తెచ్చిన ప్ర‌శాంత్ కిషోర్‌ను ఈ ద‌ఫా త‌న‌కు స‌ల‌హాదారుగా నియ‌మించుకున్నారు. ఈ నెల 1 న త‌న విధుల్లో చేరిపోయిన ప్ర‌శాంత్ […]

నంద్యాల‌లో మారిన వైసీపీ వ్యూహం

ఏపీలోని క‌ర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో వైసీపీ వ్యూహం మారింది. నిన్న‌టి వ‌ర‌కు ఇక్క‌డ వైసీపీ ఏక‌గ్రీవానికి స‌హ‌క‌రిస్తుంద‌న్న వార్త‌లు వ‌చ్చాయి. వాస్త‌వానికి ఇక్క‌డ గ‌త సాధార‌ణ ఎన్నిక‌ల్లో వైసీపీ త‌ర‌పున భూమా నాగిరెడ్డి విజ‌యం సాధించారు. ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ దెబ్బ‌కు సైకిలెక్కిన ఆయ‌న మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌కు ముందే గుండెపోటుతో హ‌ఠాన్మ‌ర‌ణం చెందారు. భూమా మృతి త‌ర్వాత జ‌గ‌న్ ఇది వైసీపీ సీటు…ఇక్క‌డ వైసీపీ ఉప ఎన్నిక‌ల్లో ఖ‌చ్చితంగా పోటీ చేస్తుంద‌ని ప్ర‌క‌ట‌న చేశారు. దీంతో […]

జ‌గ‌న్ గూటికి కొణ‌తాల‌!

సీనియ‌ర్ పొలిటిక‌ల్ నేత కొణ‌తాల రామ‌కృష్ణ. గ‌తంలో మంత్రిగా కూడా ప‌నిచేసిన ఈయ‌న దాదాపు కొన్నేళ్లుగా పాలిటిక్స్‌కు దూరంగా ఉంటున్నారు. దీంతో ప్ర‌జ‌లు దాదాపు కొణ‌తాల‌ను మ‌రిచిపోయారు. అయితే, అప్పుడ‌ప్పుడు మాత్రం అలా మీడియా ముందుకు రావ‌డం ఏవో కామెంట్లు చేయ‌డం ద్వారా లైవ్‌లో ఉన్న‌ట్టు అనిపిస్తారు. ఇక‌, తాజాగా మ‌ళ్లీ ఆయ‌న పొలిటిక‌ల్ అరంగేట్రం చేసేందుకు లైన్ క్లియ‌ర్ చేసుకుంటున్నారా? అని అనిపిస్తోంది. ముఖ్యంగా గ‌తంలో కొన్నాళ్లు.. చిరంజీవి ప్ర‌జారాజ్యంలో ఉన్న ఆయ‌న వైఎస్‌కి వీరాభిమాని. […]

చంద్ర‌బాబు అభివృద్ధిని ప‌రోక్షంగా ఒప్పుకున్న అంబ‌టి

ఏపీ సీఎం చంద్ర‌బాబుపై ఎప్ప‌టిక‌ప్పుడు ఫైర‌య్యే వైసీపీ అధికార ప్ర‌తినిధ అంబ‌టి రాంబాబు తాజాగా చేసిన కామెంట్లు క‌ల‌క‌లం రేపాయి. బాబును తిట్టిపోస్తున్నాను అని అనుకుంటూనే.. ఆయ‌న ప్ర‌భుత్వాన్ని ప‌రోక్షంగా పొడిగేశాడు అంబ‌టి. నాలుగు రోజుల కింద‌ట ముగిసిన మహానాడులో లోకేష్‌, చంద్ర‌బాబు ల ప్ర‌సంగాల‌కు కౌంట‌ర్‌గా అంబ‌టి మాట్లాడారు. అయితే, ఆయ‌న తిడుతున్నాను అనుకుని బాబు పాల‌న‌ను పెద్ద ఎత్తున పొగ‌డ‌డమేకా కుండా బాబు చెబుతున్న విష‌యాల‌ను ప‌రోక్షంగా అంగీక‌రించేశాడు. అవేంటో చూద్దాం. హైద‌రాబాద్ లో […]