2019లో మోడీకి యాంటీగా థ‌ర్డ్ ఫ్రంట్‌

ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల ఫ‌లితాలు, యూపీలో బీజేపీ ఘ‌న‌విజ‌యం చూశాక ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా అంద‌రి దృష్టి 2019 మీదే ఉంది. 2019 ఎన్నిక‌ల్లో మ‌రోసారి కేంద్రంలో ఎన్డీయే గెలుస్తుందని… ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ వ‌రుస‌గా రెండోసారి అధికారంలోకి వ‌స్తార‌న్న అంచ‌నాలు వ‌చ్చేశాయి. ఫ్యూచ‌ర్‌లో అస్స‌లు ప్రాంతీయ పార్టీల మీద ఆధార‌ప‌డ‌కుండా నార్త్ టు సౌత్ వ‌ర‌కు తిరుగులేని శ‌క్తిగా ఎద‌గాల‌నుకుంటోన్న మోడీ అందుకు త‌గ్గ‌ట్టుగానే ప్రాంతీయ పార్టీల‌ను చాలా వ్యూహాత్మ‌కంగా అణ‌గ‌దొక్కేస్తున్నారు. ఓ ప‌క్క కాంగ్రెస్ దానంత‌ట అదే […]

యూపీ గెలుపుతో మ‌రిన్ని బాదుడుల‌కు మోడీ సిద్ధ‌మా?!

ఇప్ప‌టికే వివిధ ప‌న్నుల‌తో సామాన్యుల న‌డ్డి విరుస్తున్న కేంద్రంలోని న‌రేంద్ర మోడీ ప్ర‌భుత్వం రెండు రోజుల కింద‌ట అతి పెద్ద రాష్ట్రం యూపీలో సాధించిన అప్ర‌తిహ‌త విజయంతో మ‌రింత రెచ్చిపోయే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. మెజారిటీ ఓ మాదిరిగా ఉంటే కొన్ని కీల‌క అంశాల్లో నిర్ణ‌యాలు తీసుకునేందుకు ఏ ప్ర‌భుత్వ‌మైనా వెనుకంజ వేయ‌డం త‌ప్పదు. కానీ, ఇప్పుడు యూపీ వంటి అతిపెద్ద రాష్ట్రంలో అనూహ్యంగా 325 స్థానాల‌ను కైవసం చేసుకున్న బీజేపీ నేత‌ల‌కు అంతా త‌మ‌దే అధికారం అనే […]

ప‌ళ‌నిపై క‌క్ష సాధింపుల‌కు కేంద్రం స్కెచ్ రెడీ

అమ్మ మ‌ర‌ణం త‌ర్వాత‌ త‌మిళ‌నాడులో ప‌ట్టు సాధించాల‌ని… మాజీ సీఎం ప‌న్నీర్ సెల్వాన్ని ముందుంచి తాము వెనక నుంచి చ‌క్రం తిప్పాల‌ని భావించిన కేంద్రం ఆశ‌ల‌కు ప‌ళ‌నిస్వామి రూపంలో గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలింది. శాస‌న‌స‌భ‌లో జ‌రిగిన బ‌ల‌ప‌రీక్ష‌లో ప‌ళ‌నిస్వామి విజ‌యం సాధించ‌డంతో సైలెంట్ అయిపోయింది. అయితే `ఇంత‌టితో అయిపోలేదు, నిన్ను వ‌దిలిపెట్టేది లేదు` అంటోంది కేంద్రం. ఎంతో కాలం ఆ స్థానంలో కూర్చోలేవు అంటూ పరోక్షంగా హెచ్చ‌రిక‌లు జారీచేస్తోంది. ఆయ‌న గ‌త చ‌రిత్ర‌ను త‌వ్వి.. లొసుగుల‌ను బ‌య‌ట‌కు […]

యూపీలో కూడా అదే రిజ‌ల్ట్ వ‌స్తుందా..!

దేశంలోనే పెద్ద రాష్ట్ర‌మైన ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో విజ‌యం కోసం అధికార ఎస్పీతో పాటు అక్క‌డ ప్ర‌ధాన పార్టీ అయిన బీఎస్పీ, జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డుతున్నాయి. ఇక్క‌డ విజ‌యం సాధిస్తే 2019 ఢిల్లీ పీఠానికి మార్గం చాలా వ‌ర‌కు సుగ‌మం అయిన‌ట్టే. అందుకే దేశంలోనే పెద్ద రాష్ట్ర‌మైన ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ను త‌మ గుప్పెట్లోకి తెచ్చుకునేందుకు పైన చెప్పిన పార్టీల‌న్ని స‌ర్వ‌శ‌క్తులా పోరాడుతున్నాయి. అయితే ప్ర‌స్తుతం అక్క‌డ ఉన్న ట్రెండ్‌ను బ‌ట్టి చూస్తుంటే, జాతీయ మీడియాలో జ‌రుగుతున్న […]

వెంక‌య్య‌కు పొగ పెడుతోన్న మోడీ..!

ఒక‌ప్పుడు జాతీయ బీజేపీ రాజ‌కీయాల‌ను శాసించిన వ్య‌క్తి… ప్రస్తుత కేంద్ర మంత్రి, తెలుగు వాడు అయిన వెంక‌య్య‌నాయుడుకు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీకి బాగా గ్యాప్ వ‌చ్చిందా ? ఏపీలో చంద్ర‌బాబును ప‌దే ప‌దే పొగుడుతూ ఇక్క‌డ బీజేపీ బ‌లోపేతానికి వెంక‌య్య కృషి చేయ‌డం లేద‌ని మోడీ బ‌లంగా న‌మ్ముతున్నారా ? ఈ క్ర‌మంలోనే వెంక‌య్య‌కు పొగ‌పెట్టి కేబినెట్ నుంచి త‌ప్పించేందుకు మోడీ పావులు క‌దుపుతున్నారా ? అంటే అవున‌నే ఆన్స‌ర్ బీజేపీ జాతీయ నాయ‌క‌త్వం నుంచి విన‌వ‌స్తోన్న మాట‌. […]

మోడీకి ఇది అస‌లు సిస‌లైన ప‌రీక్ష‌

ప్ర‌ధాని మోడీకి ప‌రీక్షా కాలం మొద‌లైందా? ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల‌కు న‌గారా మోగడంతో ఇది మొద‌ల‌వ‌బోతోందా?అంటే అవున‌నే అంటున్నారు విశ్లేష‌కులు! ప్రాంతీయ పార్టీల హ‌వాను తగ్గించి.. అన్ని రాష్ట్రాల్లోనూ కాషాయ జెండా రెప‌రెప‌లాడాల‌ని అధికారంలోకి వ‌చ్చిన ద‌గ్గ‌ర నుంచి మోడీ-అమిత్ షా బృందం విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తున్న విష‌యం తెలిసిందే! కానీ అవ‌న్నీ విఫ‌ల‌మైపోయాయి! ఇప్పుడు ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, మ‌ణిపూర్‌, గోవా, పంజాబ్‌, ఉత్త‌రాఖండ్‌లో ఎన్నిక‌ల‌కు ఎన్నిక‌ల క‌మిష‌న్ నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. దీంతో ఆయా రాష్ట్రాల్లో బీజేపీ జెండా […]

శ‌శిక‌ళ‌ను తొక్కేందుకు బిగ్ స్కెచ్

త‌మిళ‌నాడు దివంగ‌త మాజీ సీఎం జ‌య‌ల‌లిత మృతి త‌ర్వాత అక్క‌డ రాజ‌కీయం రోజుకో రంగు మారుతోంది. తెర మీద కనిపించే వార్తలకు.. తెర వెనుక జరిగే పనులకు ఏ మాత్రం పొంతన ఉండ‌డం లేదు. ముందుగా ప‌న్నీర్ సెల్వం ఆఘ‌మేఘాల మీద సీఎం అయ్యారు. త‌ర్వాత జ‌య నెచ్చెలి శ‌శిక‌ళ క్ర‌మ‌క్ర‌మంగా పార్టీ మీద‌, ప్ర‌భుత్వం మీద ప‌ట్టు సాధిస్తున్నారు. ఆమె సీఎం అయ్యే ప్లాన్‌లో భాగంగానే ఇదంతా చేస్తున్నార‌న్న చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు […]

శ‌శి టార్చ‌ర్ దెబ్బ‌తో ఢిల్లీకి ప‌న్నీర్ సెల్వం

త‌మిళ‌నాడు రాజ‌కీయాలు ఢిల్లీ బాట ప‌డుతున్నాయా? త‌మిళనాడు అధికార పార్టీలో ఢిల్లీ జోక్యం పెరగ‌బోతోందా? ఏనాడూ ఢిల్లీ గ‌డ‌ప తొక్క‌ని జ‌య పార్టీ.. నేత‌లు ఇప్పుడు అమ్మ అస్త‌మ‌య‌మైన ప‌ది రోజుల్లోనే ఢిల్లీని శ‌ర‌ణు జొచ్చుతున్నారా? అంటే ఔన‌నే మాటే వినిపిస్తోంది. త‌మిళ‌నాడు సీఎం, అమ్మ‌కు ఆత్మ బంధువు ప‌న్నీర్ సెల్వం ఇప్పుడు ఢిల్లీ బాట ప‌ట్టారు. విష‌యం ఏంట‌నేది పైకి ఎవ‌రూ చెప్ప‌క‌పోయినా.. అధికార అన్నాడీఎంకేలో జ‌రుగుతున్న సీఎం సీటు పోరు నేప‌థ్యంలోనే సెల్వం ఢిల్లీకి […]

కేసీఆర్ ఇంట్లో బంగారం లెక్క ఇదే

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ దెబ్బ‌కి.. దేశంలో ఇప్పుడు ఎవ‌రిని క‌దిపినా.. మీ ద‌గ్గ‌ర ఎంత డ‌బ్బుంది? అంటే.. మీ ద‌గ్గ‌ర ఎంత గోల్డుంది? అనే చ‌ర్చ‌లే న‌డుస్తున్నాయి. అంతేకాదు, సీఎంలు వెళ్లి పీఎంను క‌లిసినా.. కూడా ఇదే చ‌ర్చ న‌డుస్తోంద‌ని సాక్షాతూ తెలంగాణ సీఎం కేసీఆర్ వెల్ల‌డించారు. బ్లాక్ మ‌నీపై పెద్ద నోట్ల‌ ర‌ద్దు స్టైకింగ్ తో విరుచుకుప‌డిన ప్ర‌ధాని మోడీపై దేశ వ్యాప్తంగా ప్ర‌శంస‌ల జ‌ల్లు కురుస్తోంది. నోట్ల ర‌ద్దు త‌ర్వాత కొన్నాళ్లు మోడీని ప‌రోక్షంలో […]