తెలుగుదేశం పార్టీలో ఎంపీలు గల్లా జయదేవ్, కేశినేని నాని వ్యవహార శైలి కాస్త వేరుగా ఉంది..వారు అసలు పార్టీతో కలవడం లేదు. సెపరేట్ గా కార్యక్రమాలు చేసుకుంటున్నారు. ఇద్దరు పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఇటీవల లోకేష్ యువగళం పాదయాత్ర గుంటూరు, విజయవాడ పరిధిలో జరిగింది..అయినా సరే గుంటూరు ఎంపీగా గల్లా, విజయవాడ ఎంపీగా కేశినేని హాజరు కాలేదు. దీంతో వారిద్దరు రాకపోవడంపై చర్చ జరుగుతుంది. ఆ ఇద్దరు పార్టీకి దూరంగా ఉండటం తో పాదయాత్రలో పాల్గొనలేదా? ఇంకా […]
Tag: galla jayadev
గల్లా పొలిటికల్ గేమ్ చంద్రబాబుపై నమ్మకం లేకేనా…!
టీడీపీ ఎంపీ, దూకుడు నాయకుడిగా పేరు తెచ్చుకున్న గల్లా జయదేవ్ తాజాగా తన కు చెందిన అమర రాజా బ్యాటరీ కంపెనీని తెలంగాణకు తరలించేశారని, దీనివల్ల ఏపీకి తీవ్ర నష్టం వచ్చేసిందని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఏపీ ప్రభుత్వ అసమర్థత, వేధింపులు.. టార్గెట్ కారణంగానే గల్లా కంపెనీ వెళ్లిపోయిందని అనేక రూపాల్లో దీనిపై దాడులు జరుగుతున్నాయి. ఈ ప్రయత్నంలో 9500 కోట్ల మేరకు తెలంగాణకు పెట్టుబడులు సమకూరుతున్నాయని కూడా చెబుతున్నారు. ఇది నిజమే. వచ్చే 2030 […]
ముగ్గురు ఎంపీలు…మూడు కథలు!
ఈ మధ్య తెలుగుదేశం పార్టీలో ఎంపీల విషయంలో రకరకాల చర్చలు నడుస్తున్న విషయం తెలిసిందే..ఎంపీలు టీడీపీ అధిష్టానానికి షాక్ ఇచ్చేలా ముందుకెళ్తున్నారని కథనాలు వస్తున్నాయి. టీడీపీకి ఉన్నది ముగ్గురు ఎంపీలు రామ్మోహన్, కేశినేని నాని, గల్లా జయదేవ్.. అయితే టీడీపీలో వీరికి మంచి ఫాలోయింగ్ ఉంది…అలాగే లోక్ సభ లో తమ వాయిస్ బలంగా వినిపించే నేతలు. ఇక అంతా బాగానే ఉందనుకుంటే…ఈ ముగ్గురు ఎంపీలకు సంబంధించి..మూడు స్టోరీలు నడుస్తున్నాయి. ఇందులో మొదట కేశినేని నాని గురించి […]
ఎమ్మెల్యేలుగా ఎంపీలు…సెట్ అవుతుందా?
నెక్స్ట్ ఎన్నికల్లో గెలిచి అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా ప్రతిపక్ష టీడీపీ పనిచేస్తున్న విషయం తెలిసిందే…ఎలాగైనా నెక్స్ట్ అధికారం దక్కించుకోవాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు…ఈ సారి గాని అధికారం దక్కకపోతే జగన్ దెబ్బకు…టీడీపీ పరిస్తితి ఏం అవుతుందో చెప్పాల్సిన పని లేదు. అందుకే ఈ సారి జగన్ కు చెక్ పెట్టాలని బాబు భావిస్తున్నారు…ఈ క్రమంలోనే ఎక్కడకక్కడ కొత్త స్ట్రాటజీలతో ముందుకొస్తున్నారు. ఈ సారి బలమైన అభ్యర్ధులని అసెంబ్లీ స్థానాల బరిలో దించాలని చూస్తున్నారు. బలమైన అభ్యర్ధులు ఉంటేనే వైసీపీని […]
గల్లా కూడా తేల్చేస్తారా?
ప్రతిపక్ష టీడీపీలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి…ఓ వైపు చంద్రబాబు..అధికార వైసీపీపై పోరాడుతుంటే..టీడీపీలో ఉండే కొందరు నేతలు సొంత పార్టీపైనే పోరాటం చేసే పరిస్తితి కనిపిస్తుంది. అనూహ్యంగా టీడీపీలో ఉండే అంతర్గత విభేదాలు బయటపడుతున్నాయి. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో టీడీపీ నేతల మధ్య వర్గ పోరు నడుస్తున్న విషయం తెలిసిందే. ఇదే క్రమంలో విజయవాడ టీడీపీలో కూడా వర్గ పోరు నడుస్తున్న సంగతి తెలుస్తోంది. ఇక పోరు కాస్త ఇప్పుడు టీడీపీని దెబ్బకొట్టేలా ఉంది. అనూహ్యంగా ఎంపీ […]
టీడీపీ-వైసీపీ మధ్యలో నలుగుతోన్న మహేశ్
ఇటీవల విడుదలైన సూపర్ స్టార్ మహేశ్ బాబు స్పైడర్ టీజర్ దుమ్మురేపుతోంది. ఈ సినిమా కంప్లీట్ చేసి.. త్వరగా కొరటాల శివ డైరెక్షన్లో మరో సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నాడు సూపర్ స్టార్! అయితే రాజకీయాలు, వివాదాలు ఎప్పుడూ దూరంగా ఉండే మహేశ్కు ఇప్పుడు పెద్ద చిక్కొచ్చిపడింది. సినిమాల విషయంలో అని కంగారు పడకండి.. రాజకీయాలకు సంబంధించి!! అటు బావ, ఇటు బాబాయ్ ఎవరు ముఖ్యమో తేల్చుకోలేని సందిగ్థంలో పడిపోయాడట మన ప్రిన్స్!! టాలీవుడ్లో మహేశ్ క్రేజ్ అంతా […]
ఆ నలుగురు టీడీపీ ఎంపీలకు ప్రజాసేవ నై…వ్యాపారాలే జై
టికెట్ ఇచ్చిన పార్టీకి, ఓట్లేసిన ప్రజలకు కొంతమంది తెలుగుదేశం ఎంపీలు శఠగోపం పెడుతున్నారు. పార్టీని, ప్రజలను పట్టించుకోకుండా కేవలం వ్యక్తిగత అజెండాతో వ్యవహరిస్తున్నారు. స్వతహాగా పారిశ్రామిక వేత్తలయిన వీరు.. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా కేవలం తమ పరిశ్రమల అభివృద్ధికే ప్రాధాన్యం ఇస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తమ వ్యాపారాలు, వ్యక్తిగత సమస్యలను పట్టించుకుని.. ప్రజలను, పార్టీని పూర్తిగా విస్మరించారని అంతర్గతంగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రజలకు చేరువకాకపోవడంతో పాటు సొంత వ్యాపారాలు, సొంత ఎజెండాతో ముందుకు వెళుతుండ టంతో […]
వైసీపీ ఎంపీగా కొమ్మినేని… ఎక్కడో తెలుసా..!
కొమ్మినేని శ్రీనివాసరావు పేరు చెపితే తెలుగు న్యూస్ ఛానెల్స్ చూసే వారిలో ఆయన తెలియని వారు ఉండరు. తెలుగు మీడియా వార్తా రంగంలో తన విశ్లేషణలతో కొమ్మినేని సపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. దాదాపు మూడు దశాబ్దాలుగా ఈ రంగంలో ఉంటూ సీనియర్ జర్నలిస్టుగా ఉన్న ఆయన తెలుగులో చాలా టాప్ మీడియా సంస్థల్లో పనిచేశారు. ఎన్టీవీలో ఉంటోన్న ఆయన కొద్ది రోజుల క్రితం అనూహ్య పరిణామాలతో ఆ ఛానెల్ నుంచి బలవంతంగా బయటకు నెట్టబడ్డారు. ఆ […]
బ్రాహ్మణి ఎంట్రీతో ఆ ఇద్దరు ఎంపీలకు టెన్షన్..!
ఏపీ సీఎం చంద్రబాబు కోడలు బ్రాహ్మణి ఇద్దరు ఎంపీలను తెగ టెన్షన్ పెడుతున్నారు. ఇటు మంత్రి వర్గ విస్తరణతో చంద్రబాబు..మంత్రులను టెన్షన్ పెడుతుంటే.. ఇప్పుడు ఆ పార్టీ ఎంపీల్లో గుబులు పుట్టిస్తున్నారు ఆయన కోడలు బ్రాహ్మణి! ముఖ్యంగా చంద్రబాబు కుటుంబం నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీచేసే వారి జాబితా పెరుగుతోంది. ఇప్పటికే ఆయన తనయుడు.. ఎమ్మెల్సీగా రాజకీయాల్లో ప్రవేశించారు. ఇప్పుడు ఆయన కోడలు బ్రాహ్మణి కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నారనే లీకులు ఇప్పుడు ఇద్దరు ఎంపీలను […]