టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ హనుమాన్ తో ఒక్కసారిగా పాన్ ఇండియా లెవెల్ బ్లాక్ బస్టర్ కొట్టి తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్నాడు. ఈ క్రమంలోనే ఆయన నుంచి వచ్చిన లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ మీరాయ్. కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమాను.. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ ప్రతిష్టాత్మకంగా నిర్మించాడు. ఈ సినిమాలో తేజ ఓ యోధుడిగా మంచి మనసున్న వ్యక్తిగా , మంచు మనోజ్ ఓ పవర్ఫుల్ విలన్ గా మెరిశారు.
ఇక రిలీజ్కు ముందే భారీ అంచనాలను నెలకొల్పిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా నేడు గ్రాండ్ లెవెల్లో రిలీజై బ్లాక్ బస్టర్ సక్సెస్ టాక్ దక్కించుకుంది. సుపర్ యోధా తేజ నటన అదిరిపోయింది అని ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ క్రమంలోనే సినిమా క్లైమాక్స్లో మీరాయ్ 2 ఉందని ప్రకటించారు. ఇక మీరాయ్ 2 టైటిల్ మీరాయ్ జైత్రయా.. అని రివిల్ చేసారు. అలాగే ఈ సీక్వెల్ లో విలన్ గా పాన్ ఇండియన్ స్టార్ హీరోదగ్గుపాటి రానా కనిపించనున్నాడు. ఇక ఈ సీక్వెల్ ఎప్పుడు తీసుకొస్తారు అనేది క్లారిటీ రావాల్సి ఉంది.
ఇక నెక్స్ట్..తేజ సజ్జ హనుమాన్ సీక్వెల్ గా జై హనుమాన్లో తేజా బిజీ అవుతాడని టాక్ నడుస్తుంది. ఈ సినిమాలో కనిపించేది కొంతసేపే అయినా.. తన పాత్ర చాలా కీలకంగా ఉండనుందని సమాచారం. అలాగే.. జాంబిరెడ్డి మూవీ సీక్వెల్గా జాంబిరెడ్డి 2ను కూడా తాజాగా ప్రకటించారు. ఈ సినిమాను పీపుల్స్ మీడియాని తెరకెక్కిస్తుంది. ముందు జై హనుమాన్, జంబిరెడ్డి సీక్వెల్స్ ను పూర్తిచేసి తర్వాత మీరాయ్ పార్ట్ 2 సెట్స్లోకి అడుగు పెడతాడట.