మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మొదటిసారిగా బాలీవుడ్ లో నటిస్తున్న మూవీ వార్2 .. బాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన హృతిక్ రోషన్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్న ఎన్టీఆర్ .. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ గ్లిమ్స్ సినిమాల పై అంచనాలు భారీగా పెంచేశాయి .. అలాగే ఎన్టీఆర్ , హృతిక్ రోషన్ మధ్య వచ్చే యాక్షన్ సీన్స్ ఫాన్స్ కు భారీ విజువల్ ఫీస్ట్ ఇస్తాయని చిత్ర యూనిట్ బలంగా భావిస్తుంది .. అలాగే యాష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమా ఈ ఏడాది ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ముందుకు రాబోతుంది .అయితే ఇప్పుడు ఈ సినిమా తెలుగు రైట్స్ కోసం భారీ డిమాండ్ ఏర్పడింది . అయితే ఈ సినిమా ఆసలు నిర్మాతలు సుమారు 100 కోట్ల మేర ధర చెప్పడంతో తెలుగు నిర్మాతలు కొంత వెనక్కు తగ్గుతున్నారు .. ఇక దాంతో తామే స్వయంగా రిలీజ్ చేయాలని ఒక నిర్ణయానికి వచ్చేసింది యాష్ రాజ్ ఫిలిమ్స్ .. అందుకు అనుగుణంగా పలు థియేటర్స్ తో భారీ అగ్రిమెంట్స్ కూడా కుదుర్చుకుంటుంది .. అయితే ఇప్పుడు మరోసారి తెలుగు వార్ 2 రైట్ కోసం .. టాలీవుడ్ కు చెందిన ఓ బడా నిర్మాత సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగ వంశీ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు .
అదేవిధంగా ఏషియన్ సినిమాస్ నిర్మాత కం డిస్ట్రిబ్యూటర్ అయిన ఏషియన్ సునీల్ కూడా వార్ 2 కోసం ప్రయత్నించి బేరం కుదర పోవడంతో రజినీకాంత్ కూలీ తెలుగు రైట్స్ భారీ ధరకు కొనుగోలు చేసుకున్నాడు .. అయితే ఇక్కడ నిర్మాత నాగ వంశీ మాత్రం పట్టు వదలని విక్రమార్కుడిలా బాలీవుడ్ నిర్మాతల తో భారీ మంతానాలు చేస్తూనే వస్తున్నారు .. ఒకవేళ నాగ వంశి చేతికి ఈ సినిమా వస్తే మాత్రం తెలుగు రాష్ట్రాల్లో ఏషియన్ వర్సెస్ సితార అనే విధంగా యుద్ధం మారుతుంది ..
వార్ 2 తెలుగు హక్కులు కోసం .. పట్టు వదలని టాలీవుడ్ నిర్మాత .. తగ్గేదేలే..!
