కింగ్డమ్ రిలీజ్.. రవితేజ ఫ్యాన్స్ లో టెన్షన్ టెన్షన్.. !

టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నటించిన తాజా మూవీ మాస్ జాతర. మొదట మేలో రిలీజ్ అవుతుందని టాక్ వినిపించినా ఆగస్టు 27న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. అయితే.. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ డేట్‌పై సందేహాలు మొదలయ్యాయి. కచ్చితంగా.. మొదటి చెప్పిన రిలీజ్ డేట్ సినిమా రిలీజ్ చేస్తారా.. లేదా అని అభిప్రాయాలు ఫ్యాన్స్ నుంచి వ్యక్తమవుతున్నాయి. దానికి ప్రధాన కారణం అదే సంస్థ నిర్మించిన కింగ్‌డ‌మ్ మూవీ. ఈ సినిమా డేట్స్ ఇంకా ఫిక్స్ కాకపోవడమే. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమా.. గౌతమ్ తిననూరి డైరెక్షన్‌లో రూపొందింది.

ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల వల్ల ఆలస్యం అవుతూ వచ్చింది. ప్రస్తుతం జూలై 25న లేదా ఆగస్టు 1న సినిమా రిలీజ్ చేయనున్నట్లు టాక్‌ నడుస్తోంది. అయితే.. ఈ రెండు డేట్లు రిలీజ్ చేస్తే సరే సరి. లేదా.. సినిమా అంతకంటే వెనక్కు వెళ్తే మాత్రం మాస్ జాతర సినిమా రిలీజ్‌కు ముప్పు తప్పదు అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కారణం ఒకే నెలలో రెండు సినిమాలను ఒకే సంస్థ నుంచి రిలీజ్ చేయరు అన్న సందేహమే. కింగ్డమ్ సినిమాను ఆగస్టు 1న వేస్తే సరే.. లేదా ఆగస్టు 8న వేయాల్సి వస్తే కచ్చితంగా అది మేకర్స్‌కు రిస్క్ అవుతుంది. కారణం ఆగస్టు 15న రెండు భారీ సినిమాలో ఉన్నాయి.

Sithara Entertainments Faces Scheduling Issues | cinejosh.com

ఈ క్రమంలోనే సినిమా మరింత వెనక్కి వెళ్తే.. మాస్ జాతర సినిమా రిలీజ్ ఉంది. ఈ క్రమంలోనే రవితేజ అభిమానులు టెన్షన్ మొదలైందట‌. ఇదిలా ఉంటే రవితేజ మాత్రం మాస్‌ జాతరను మరోసారి వాయిదా వేయొద్దని.. ఆగస్టులో అనుకున్న డేట్ ను విడుదల చేయాల్సిందేనని నిర్మాత నాగవంశీకి స్ట్రాంగ్ గా చెప్పినట్లు తెలుస్తోంది. కారణం.. మళ్ళీ నాలుగు నెలల గ్యాప్ లో సంక్రాంతికి మరో సినిమాను రిలీజ్ చేయాల్సి ఉంది. ఈ క్రమంలోనే రవితేజ కూడా రిలీజ్ డేట్ లో అసలు వెనుకడుగు వేసే సమస్య లేదని తెలుస్తుంది. ఇక కింగ్డమ్ కు జులై 25 లేదా ఆగస్టు 1న తప్ప మరో డేట్ కు రిలీజ్ చేసుకునే ఛాన్స్ లేదు. మరి.. మేకర్స్ ఈ రెండు సినిమాల రిలీజ్ డేట్ల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో.. వేచి చూడాలి.