బాలయ్యకు భార్య వసుంధర ఇచ్చిన కట్నం ఏంతో తెలుసా.. ఆమె ఎవరి కూతురంటే.. బ్యాగ్రౌండ్ ఇదే..!

టాలీవుడ్ నందమూరి నట‌సింహం బాలకృష్ణ పేరు చెబితేనే ఫ్యాన్స్‌లో పూన‌కాలు మొదలైపోతాయి. ఎన్టీఆర్ నటవారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన బాలయ్య.. హీరోగా అంచలంచెలుగా ఎదుగుతూ సీనియర్ స్టార్ హీరోగా.. ప్రస్తుతం నెంబర్ వన్ పొజిషన్‌లో రాణిస్తున్న సంగతి తెలిసిందే. అలాంటి బాలయ్యకు సంబంధించిన కొన్ని విషయాలు ప్రస్తుతం నెటింట తెగ వైరల్‌గా మారుతున్నాయి. ఎన్టీఆర్‌కు 11 మంది సంతానం కాగా.. వారిలో ఏడుగురు అబ్బాయిలు, నలుగురు అమ్మాయిలు. 11 మందిలో అబ్బాయిలలో అందరికన్నా చిన్నవాడు బాలకృష్ణ. ఈ క్రమంలోనే బాలకృష్ణ అంటే అందరికీ గారాబం.. ఇష్టం.

ఇక ఎన్టీఆర్ పొలిటికల్ ప్రచారాల్లో బిజీగా ఉన్న టైంలో.. ఆయన భార్య బసవతారకం.. బాలయ్య పెళ్లిపై ఎన్టీఆర్కు ఒత్తిడి తీసుకురావడంతో.. ఆమె పేరు భరించలేక.. ఎన్టీఆర్, నాదెండ్ల భాస్కరరావుకు ఈ పెళ్లి భాద్య‌తలు అప్పగించారట. భాస్కరరావు.. తన బంధువైన దేవరపల్లి సూర్యరావు.. కూతురైన వసుంధరను బాలకృష్ణకు పర్ఫెక్ట్‌గా ఉంటుందని సంబంధం చూశాడట. ఇక ఈ అమ్మాయి కూడా అందరికీ నచ్చడంతో.. డిసెంబర్ 8, 1982లో వస్తుందరకు బాలకృష్ణతో గ్రాండ్గా వివాహం జరిగింది. ఇక వసుంధర తండ్రి దేవరపల్లి సూర్యారావు.. శ్రీరామదాసు మోటర్ ట్రాన్స్పోర్ట్ అధినేత.

కాగా.. వసుంధర పెళ్ళికి బాలయ్య ఒక్క రూపాయి కూడా కట్నం తీసుకోలేదట. పెళ్లికూతురు తండ్రి.. కూతురికి కానుకగా హైదరాబాద్‌లో అప్ప‌ట్లోనే రూ.10 లక్షలతో ఇల్లు కట్టించి ఇచ్చాడట. ఇక బాలకృష్ణ, వసుంధరకు ముగ్గురు సిల్ల‌లు. కూతుర్లు బ్రాహ్మణి, తేజస్విని.. కొడుకు మోక్షజ్ఞ అన్న సంగతి తెలిసిందే. ఇక.. బాలయ్య పెద్ద కూతురు బ్రాహ్మణికి.. నారా లోకేష్ తో వివాహం కాగా.. తేజస్వినికి గీతం యూనివర్సిటీ ఎండి శ్రీ భరత్తో వివాహం జరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం నందమూరి బాలయ్య కొడుకు మోక్షజ్ఞ సినీ ఇండస్ట్రీ ఎంట్రీ కోసం ప్లాన్ చేస్తున్నారు.