టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు తెలుగు ఇండస్ట్రీలోనే కాదు.. దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. కేవలం ప్రాంతీయ భాషలోనే ఆయన సినిమాలు నటించినా.. పాన్ ఇండియా లెవెల్లో అభిమానాని దక్కించుకున్నాడు. ఇక లేడి ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలోనే సాధారణ ఆడియన్స్తో పాటు.. ఎంతో మంది స్టార్ సెలబ్రిటీస్ సైతం మహేష్ బాబు తమ అభిమాన హీరో అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. గతంలో ఎంతోమంది బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు కూడా.. తమకు మహేష్ బాబు అంటే ఇష్టమని.. క్రష్ అని ఓపెన్ గానే అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఇక ఐదు పదుల వయస్సులోనూ మహేష్ ఇప్పటికి హ్యాండ్సమ్ లుక్స్ తో ఆకట్టుకుంటున్నాడు. ఈ క్రమంలో మహేష్ తో సినిమాలు చేయాలని ఎంతోమంది యంగ్ బ్యూటీలు సైతం ఆరాటపడుతున్నారు.
బాలివుడ్ స్టార్ హీరోయిన్ సైతం మహేష్ తో సినిమా చేసేందుకు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మహేష్ ను విపరీతంగా అభిమానించే మరో బ్యూటీ ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని షేర్ చేసుకుంది. ఇంతకీ ఆమె ఎవరో కాదు ప్రముఖ డైరెక్టర్ శంకర్ కుమార్తె.. హీరోయిన్ అదితి శంకర్. ఇటీవల కాలంలో ఆమె హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి.. మంచి సక్సెస్లు అందుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా.. తెలుగులో భైరవం మూవీతో ఆడియన్స్ను పలకరించిన ఈ అమ్మడు.. సినిమా ప్రమోషన్స్లో భాగంగా.. ఓ ఇంటర్వ్యూలో పాల్గొని మహేష్ పై తనకున్న అభిమానాన్ని వివరించింది. తనకు, తన అక్క ఐశ్వర్య కు మహేష్ బాబు అంటే పిచ్చని.. ఆయనపై ఉన్న అభిమానంతో ఒకసారి ఫోటో దిగాలని కోరుకున్నా అంటూ వివరించింది.
నాకు, మా అక్కకు మహేష్ పై ఉన్న ఇష్టంతోనే.. ఒకసారి ఆయన ఒక హోటల్లో కనిపిస్తే వెంటనే ఫోటో కావాలని వెళ్లి అడిగాం. ఆయన ఇప్పుడు కాదంటూ నో చెప్పేసాడు. మేము ఫుల్ డిసప్పాయింట్మెంట్తో అక్కడి నుంచి వెనుక వచ్చేశాం. తర్వాత మేము డైరెక్టర్ శంకర్ కూతుళ్ళమని తెలుసుకున్న మహేష్ పిలిచి మరి ఫోటో ఇచ్చారు. ఆయన్ను అంత దగ్గరగా చూడడం మాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఆ సమయంలో ఫ్యాన్ మూమెంట్లో ఫుల్ గా ఎంజాయ్ చేసాము అంటూ అదితి శంకర్ వివరించింది. ఆయన చాలా స్వీట్ పెర్సన్, సింపుల్ పర్సన్ అంటూ వివరించింది. ప్రతి ఒక్కరితోను కూల్ గా మాట్లాడటం నేను చూశా అంటూ తన అభిమానాన్ని షేర్ చేసుకుంది. ఆయనతో ఫోటో దిగడం సంతోషంగా అనిపించిందంటే సింపుల్ బోల్డ్ కామెంట్స్తో ఆమె చేసిన కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి.