టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి నటసింహం బాలకృష్ణ పేరు చెప్పగానే టక్కున గుర్తుకు వచ్చేది ఆయన ఒక కోపిష్ట్ అని.. కోపం ఎక్కువ.. ఎదుట ఎంత పెద్దవారు ఉన్నా.. ఎలాంటి వ్యక్తిత్వం గలవారు ఉన్నా.. వారు తప్పు చేస్తే ముఖంపై ఆయన కోపాన్ని చూపించేస్తాడు అని చెప్తూ ఉంటారు. కొన్ని కొన్ని సందర్భాల్లో ఇది డైరెక్ట్గా ప్రూవ్ అయింది కూడా. ఇప్పటివరకు బాలయ్య పలు ఈవెంట్స్ లో, ఫంక్షన్స్లో సందడి చేసిన క్రమంలో ఆయనతో ఫోటో దిగేందుకు ఎగబడే అభిమానులపై విరుచుకుపడిన సందర్భాలు ఉన్నాయి. ఆయన కాకుండా ఇతర హీరో, హీరోయిన్లు అయితే.. అభిమానులకు ఫోటోలు అడిగితే ఇస్తారు.
లేదంటే ఇప్పుడు కుదరదు అని చెప్పేస్తారు. మరి బలవంతం చేస్తే సెక్యూరిటీ గార్డ్స్ వాళ్ళ సంగతి చూస్తారు. కానీ.. బాలయ్య అలా కాదు.. అడిగిన వారికి కచ్చితంగా ఫోటోలు ఇస్తాడు. అయితే.. బాలయ్య ఎప్పటికప్పుడు తన స్టైల్ ను చూపిస్తూనే ఉంటాడు. అలా.. గతంలో బాలయ్య ఓ ఈవెంట్లో స్టేజ్పై మాట్లాడుతూ ఎదుట ఉన్నవారికి ఫోన్ క్యాచ్ విసిరిన ఆ వీడియో అప్పట్లో తెగ వైరల్ గా మారింది. అయితే.. కొద్ది రోజుల క్రితం టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ భార్య నందమూరి ఇంటి కోడలు లక్ష్మీ ప్రణతి కూడా సేమ్ టు సేమ్ అదే స్టైల్లో.. తన బ్రదర్ ఎంగేజ్మెంట్ రోజు తన ఫోన్ ఎదుట ఉన్న వారిని క్యాచ్ పట్టుకోమంటూ విసిరింది.
ఆ వీడియో అప్పట్లో సంచలనం సృష్టించింది. ఒకప్పుడు బాలయ్య ఎలా అయితే తన జేబులో ఫోన్ ని క్యాచ్ పట్టుకోమని విసిరాడో.. ఇప్పుడు అదే స్టైల్లో లక్ష్మీ ప్రణతి కూడా తన ఫోన్ విసిరిందని అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అంతేకాదు.. చాలామంది తమ బలుపుని చూపిస్తున్నారని.. లేకపోతే చేతిలో ఉన్న ఫోన్ వాళ్లకు ఏం అంటూ అంతలా ఎదుటి వారికి క్యాచ్ పట్టుకోమని ఫోను విసిరేయడం అవసరమా.. బాలకృష్ణనే అనుకుంటే ఇప్పుడు లక్ష్మీ ప్రణతి ఆయన్ని మించిపోయి తయారైంది అంటూ.. అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఇక అదే న్యూస్ ఇప్పుడు మరోసారి నెటింట వైరల్ గా మారుతుంది.