ఇటీవల కాలంలో సినీ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రేషన్ ఒకరినొకరు ప్రేమించుకోవడం.. డేటింగ్ చేయడం.. బ్రుకప్.. ఏళ్ళు తరబడి ప్రేమించి వివాహం చేసుకున్న జంటలు కూడా విడాకులు తీసుకోవడం చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలోని ఇండస్ట్రీ వారికి డివోర్స్ ఫ్యాషన్ అయిపోయిందని.. చిన్నచిన్న విభేదాలు కూడా విడిపోతున్నారంటూ రకరకాలుగా అభిప్రాయాలు వ్యక్తమవుతూన్నాయి. కాగా.. ఎంత పెద్ద స్టార్ సెలబ్రిటీస్ అయినా.. సాధారణ జనాలైనా.. భార్యాభర్తలు విడిపోతే భర్త నుంచి భార్య తన మిగతా జీవితాన్ని కొనసాగించడానికి భరణాన్ని డిమాండ్ చేయాల్సి ఉంటుంది. అయితే.. ఒక్కొక్కసారి భరణం వందల కోట్లల్లో కూడా ఉంటుంది. మరి కొంతమంది.. భర్తలకు ఎలాంటి భరణం తీసుకోకుండానే డివోర్స్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి.
అలా.. ఇప్పటికే ఎంతోమంది స్టార్ సెలబ్రిటీస్.. తమ భార్యల నుంచి విడిపోయి.. వారి జీవనార్థం కోసం కోట్లల్లో భరణాలు ఇచ్చిన సందర్భాలు చూస్తూనే ఉన్నాం. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఓ స్టార్ నటి మాత్రం దీనికి పూర్తిగా విరుద్ధం. ఈమె భర్త నుంచి ఎలాంటి భరణం డిమాండ్ చేయలేదు.. విడాకుల తర్వాత అన్నింటికీ విరుద్ధంగా భర్తకే భరణాన్ని చెల్లించి తన బిడ్డను తన సొంతం చేసుకుంది. తన బిడ్డ ఆమెకు సర్వస్వమని లక్షల రూపాయలు అందుకే అతనికి ధారపోసానంటూ వివరించింది. నా బిడ్డ కంటే మించిన ఆస్తి మరొకటి లేదంటూ ఆమె వివరించింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో కాదు ప్రముఖ హిందీ టెలివిజన్, సినిమా నటి.. శ్వేత తివారి. 1997లో రాజ చౌదరిని వివాహం చేసుకున్న శ్వేత తివారి.. 2007లో అతనికి విడాకులు ఇచ్చేసింది.
సెటిల్మెంట్లో భాగంగా రూ.93 లక్షల విలువైన ఒక ఫ్లాట్ ను అతనికి భరణం గా రాసిచ్చినట్లు సమాచారం. ఐదేళ్ల న్యాయపోరాటం తర్వాత వీరికి డివోర్స్ వచ్చింది. శ్వేత.. గృహహింస, మద్యపాన అలవాట్లను ప్రధాన కారణాలుగా పేర్కొంది. ఈ క్రమంలోనే తన కూతురు ఫలక్ను.. తన సంరక్షణ లోకి తీసుకునేందుకు శ్వేత తన ఆస్తిని సైతం ఇచ్చేయడానికి సిద్ధపడింది. మొదట్లో భర్త అభినవ్.. శ్వేతతో ఫ్లాట్ ఉమ్మడి యాజమాన్య ప్రతిపాదన తిరస్కరించాడు. దీంతో ఆమె ఆ ఫ్లాట్ ను పూర్తిగా వదులుకుంది. ఆ ఫ్లాట్ కన్నా తన కూతురు సంరక్షణ తనకు ముఖ్యమని.. కూతురు కంటే ఏది ఎక్కువ కాదంటూ శ్వేత క్లారిటీ ఇచ్చింది. ఇ క్రమంలోనే ఆమె నిర్ణయంపై పలువురు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇంకోవైపు భర్తకే భరణం ఇచ్చి రికార్డ్ సృష్టించింది అంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.