టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్లో ఎస్ఎస్ఎంబి 29 సినిమా షూట్ లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఏకంగా రూ.1500 కోట్ల బడ్జెట్తో రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సినిమాపై పాన్ ఇండియా లెవెల్ ఆడియన్స్లో పిక్స్ లెవెల్లో అంచనాలు నెలకొన్నాయి. ఇక మహేష్ మొట్టమొదటి పాన్ ఇండియన్ సినిమా ఇదే అయినప్పటికీ.. ఆయనకు ఎప్పటినుంచో పాన్ ఇండియా లెవెల్ లో ఇమేజ్ ఉంది. ఈ క్రమంలోనే మహేష్ బాబుకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలు ప్రస్తుతం తెగ వైరల్గా మారుతున్నాయి. కాగా.. ప్రస్తుతం టాలీవుడ్లో రీ రిలీజ్ ట్రెండ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
అలా.. రీరిలీజ్ అవుతున్న సినిమాల్లో.. కొన్ని సినిమాలు మాత్రమే ఆడియన్స్లో మంచి రెస్పాన్స్ అందుకుంటున్నాయి. ముఖ్యంగా.. సూపర్ స్టార్ మహేష్ హీరోగా తెరకెక్కిన ఎన్నో సినిమాలు రీ రిలీజ్ లో అదరగొడుతున్నాయి. అలా.. ఇప్పటివరకు టాలీవుడ్ నుంచి రీ రిలీజ్ అయిన టాప్ సిక్స్ సినిమాలలో మూడు సినిమాలు మహేష్వి కావడం విశేషం. ఇంతకీ ఆ సినిమాలు ఏంటి.. ఆ సినిమాల కలెక్షన్ల రికార్డులు ఏంటో ఒకసారి తెలుసుకుందాం. మహేష్ బాబు హీరోగా, సోనాలి బింద్రే హీరోయిన్గా.. కృష్ణవంశీ డైరెక్షన్లో రూపొందిన మురారి. కొద్ది నెలల క్రితం రిలీజై ఏకంగా రూ.8.90 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టిన సంగతి తెలిసిందే.
ఇక ఇప్పటివరకు రీ రిలీజ్లో హైయెస్ట్ కలెక్షన్లు కొల్లగొట్టిన సినిమాగా మురారి మొదటి స్థానంలో నిలిచింది. తర్వాత.. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన గబ్బర్ సింగ్.. రూ.8.01 కోట్ల కలెక్షన్లు దక్కించుకొని రెండవ స్థానాన్ని అందుకుంది. ఇక పవన్ హీరోగా నటించిన ఖుషి మూవీ రూ.7.46 కోట్ల కలెక్షన్లతో నాలుగవ స్థానంలో ఉండగా.. మహేష్ బాబు విక్టరీ వెంకటేష్ కాంబోలో తరికేసిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు రూ.6.60 కోట్ల కలెక్షన్లతో ఐదవ స్థానాన్ని సొంతం చేసుకుంది. మహేష్ హీరోగా తెరకెక్కిన బిజినెస్ మాన్ రూ.5.85 కోట్ల కలెక్షన్లతో ఆరవ స్థానంలో నిలిచింది. ఈ క్రమంలోనే రీ రిలీజ్లో ఈ రేంజ్ కలెక్షన్లు కొల్లగొట్టి రికార్డులు క్రియేట్ చేయడం మహేష్ కు మాత్రమే సాధ్యమైందని.. ఈ రేంజ్ లో కలెక్షన్లు కొల్లగొట్టి రికార్డును బ్రేక్ చేయడం కూడా కష్టమేనంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్.