ఓవర్సీస్‌లో సందడి చేస్తున్న మహేష్ ‘ ఖలేజా ‘.. మేనియా షురూ..!

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో రీ రిలీజ్ ట్రెండ్‌ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు స్టార్ హీరోల సినిమాలు.. రీ రిలీజై బాక్సాఫీస్ వ‌ద్ద సంచలనాలు సృష్టిస్తూ.. ఫ్యాన్స్‌ను అలరించాయి. కాగా.. ఇప్పుడు ఇదే కోవాలో మరో రెండు ఇంట్రెస్టింగ్ సినిమాలను రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నారు టాలీవుడ్ మేకర్స్. ఇందులో ఒక క్లాసికల్ క‌ల్ట్ సినిమాగా ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నా మహేష్ బాబు ఖలేజా మూవీ కూడా ఉంది.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో సోషియా ఫాంటసీ డ్రామాగా రూపొందిన ఈ సినిమా 2010లో భారీ అంచనాల మధ్యన రిలీజ్ అయింది. కాగా.. అప్పట్లో బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ గా నిలిచిన ఈ సినిమా తర్వాత బుల్లితెరపై ప్రసారమైన సమయంలో కల్ట్‌ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇన్నేళ్లు గడిచిన ఇప్పటికి ఈ సినిమాపై ఆడియన్స్ ఎంతో ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. దీంతో ఇప్పుడు ఈ సినిమాను మే 30న రీ రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు.

కాగా.. మహేష్ ఫాలోయింగ్ దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాను భారీ లెవెల్ లో ప్రమోట్ చేస్తున్నారు టీం. ఈ క్రమంలోనే తాజాగా సినిమాకు సంబంధించిన 50 సెకండ్ల ప్రమోషనల్ వీడియోను రిలీజ్ చేయ‌నున్నారు. అంతేకాదు మరో హీరో.. జూనియర్ ఎన్టీఆర్ నటించిన యమదొంగ రీ రిలీజ్ మూవీకి అటాచ్ చేస్తూ.. ఈ వీడియోను టెలికాస్ట్ చేయనున్నట్లు వివరించారు. ఇక ఓవర్సీస్ థియేటర్లో ఈ మాషప్ ప్రదర్శించినట్లు యూనిట్ వెల్లడించింది. మరి ఖలేజా సినిమాకి ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో వేచి చూడాలి.