టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా, అక్కినేని ఫ్యామిలీ లకు ఉన్న క్రేజ్, పాపులారిటి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దశాబ్దాలు కాలంగా ఈ రెండు కుటుంబాలు నుంచి ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలుగా అడుగుపెట్టి రాణిస్తున్నారు. ఈ క్రమంలోనే అక్కినేని, మెగా కాంబోలో ఓ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ రూపొందనుంది అంటూ టాక్ నెటింట తెగ వైరల్ గా మారుతుంది. ఇంతకీ ఈ రెండు కుటుంబాల నుంచి నటించనున్న హీరోలు ఎవరో చెప్పలేదు కదా.. టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, అక్కినేని యువ సామ్రాట్ నాగచైతన్య. ఎస్.. మీరు వినది కరెక్టే. వీళ్ళిద్దరి కాంబోలో ఓ మల్టీ స్టారర్ రూపొందనుందంటూ న్యూస్ నెటింట వైరల్గా మారుతుంది.
ఇంతకీ సినిమా బ్యాక్ డ్రాప్, డైరెక్టర్ ఎవరు అనేదానిపై క్లారిటీ రాకున్నా.. వీరిద్దరి కాంబోలో మల్టీ స్టారర్ మాత్రం కన్ఫామ్ అంటూ టాక్ వైరల్ గా మారుతుంది. అయితే ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే ఇప్పటికే నాగచైతన్య పరశురామ్ డైరెక్షన్లో ఓ క్రేజి మల్టీస్టారర్ లో నటించనున్నాడు. ఈ సినిమాలో శింబు కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. మరో పక్క రామ్ చరణ్ వరుస సినిమాలతో రాణిస్తున్నాడు. అంతేకాదు చరణ్ సైతం కృష్ణవంశీ డైరెక్షన్లో వెంకటేష్ తో కలిసి మల్టీ స్టారర్ సినిమా నటించనున్నట్లు అఫీషియల్ గా వెల్లడించాడు.
ఇక ఇద్దరూ హీరోలు ఎవరి సినిమాల్లో వాళ్ళు బిజీగా ఉంటున్న నేపథ్యంలో.. రామ్ చరణ్, నాగ చైతన్య కాంబోలో మల్టీస్టారర్ అంటూ టాక్ వైరల్ గా మారుతుంది. ఇందులో వాస్తవం ఎంతో తెలియదు గాని.. నిజంగానే వీళ్ళిద్దరి కాంబోలో ఓ మల్టీ స్టారర్ రూపొందితే మాత్రం నిజంగా మెగా, అక్కినేని అభిమానులకు ఇది పండగే అనడంలో అతిశయోక్తి లేదు.