టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలుగా చిరు, బాలయ్య పోటాపోటీగా సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇద్దరికి ఎవరికి వారికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. వీళ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సందడి ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ హీరోల ఫైట్, డ్యాన్స్ డైలాగ్లను అభిమానులు విపరీతంగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కుర్ర హీరోలకు పోటాగా నటిస్తూ బిగ్స్క్రీన్పై అదరగొడుతున్నారు.
ఇక ఈ సీనియర్ హీరోలు కెరీర్ పరంగా తమ సినిమాలతో ఎ్త తలపడినా.. పర్సనల్ లైఫ్ లో మాత్రం ఇద్దరూ ఎంతో స్నేహంగా ఉంటారు. చాలా క్లోజ్ గా కలిసిమెలిసి ఉంటూ సరదాగా మాట్లాడుకుంటారు. అయితే ఇంతకీ ఈ ఇద్దరు లెజెండ్రీ హీరోల మధ్య నవ్వుతూ నిల్చున్న ఆ చిన్ని పాప ఎవరో గుర్తుపట్టారా.. ఆమె ప్రస్తుతం ఇండస్ట్రీలోనే బిగ్గెస్ట్ ఫిగర్. తనను ఎవరో గుర్తుపట్టడం కాస్త కష్టమే లెండి.. మేమే చెప్పేస్తాం. తనే వైజయంతి మూవీస్ అధినేత ప్రముఖ నిర్మాత అశ్విని దత్ కూతురు ప్రియాంక దత్. ప్రియాంక దత్ తెలుగులో నిర్మాతగా వ్యవహరిస్తూ భారీ ప్రాజెక్టులను సైతం ప్రొడ్యూస్ చేస్తున్న సంగతి తెలిసిందే.
అంతే కాదు ఆమె టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ భార్య కూడా. ఇద్దరు సీనియర్ స్టార్ సెలబ్రిటీస్ మధ్య నిలబడి ఫోటోకు స్టిల్ ఇచ్చిన ప్రియాంక దత్త్ చిన్నప్పటి ఫోటో ప్రస్తుతం ట్రెండిగా మారింది. ఇక ప్రియాంకతో చిన్ననాటి ఫోటో చూసినా నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు. కాగా ప్రియాంక దత్ కూడా తండ్రి మార్గంలోనే నడుస్తూ సినిమాలను నిర్మిస్తూ సక్సెస్ లో అందుకుంటుంది. తండ్రికి తగ్గ కూతురుగాఆ రాణిస్తుంది. ఇక పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన బాలు సినిమాకు కో ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన తర్వాత.. త్రీ ఏంజెల్ స్టూడియో ఏర్పాటు చేసి బాణం, ఓం శాంతి, సారొచారు ఇలా ఎన్నో సినిమాలుకు ప్రొడ్యూసర్ గా చేసింది. దీంతో పాటే.. యాదోమ్ కి బరాత్ అనే షార్ట్ ఫిలింను కూడా ప్రొడ్యూస్ చేసింది. ఇప్పుడు సోదరీ స్వప్న దత్త్తో కలిసి తండ్రి నిర్మాణ సంస్థలోనే తెరకెక్కుతున్న ఎన్నో సినిమాల బాధ్యతలను చూసుకుంటుంది.