టాలీవుడ్ కోలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతున్న హీరోయిన్ల కీర్తి సురేష్ కూడా ఒకరు. ఈ ముద్దుగుమ్మ ఈ మధ్యకాలంలో లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో కూడా నటిస్తు బిజీగా ఉన్నది. ప్రస్తుతం ఈమె నటించిన రఘు తాత మరియు బేబీ జాన్ చిత్రాలు త్వరలోనే రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి. ఇటీవలే విడుదలైన కల్కి 2898 AD చిత్రంలో కూడా బుజ్జి అనే పాత్రలో తన వాయిస్ ను అందించి మరింత పాపులారిటీ సంపాదించుకున్నది.
తాజాగా ఈ ముద్దుగుమ్మ రఘు తాత అనే సినిమా ట్రైలర్ ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన కీర్తి సురేష్ పలు విషయాలను తెలిపింది..తనకు కోలీవుడ్ హీరో శింబు అంటే చాలా ఇష్టమని.. అతనితో కలిసి నటించాలని కోరిక ఉందంటూ తెలియజేసింది. తనకి కూడా చాలా ఫ్యాన్ బేస్ ఉందని ఒకటి రెండు సార్లు ఫోన్లో కూడా మాట్లాడినట్లుగా కూడా తెలియజేసింది ఈ ముద్దుగుమ్మ. అయితే ఈ వ్యాఖ్యలతో అభిమానులైతే కాస్త ఆనందాన్ని తెలియజేస్తున్నారు.
అయితే కీర్తి అభిమానులు మాత్రం ఈ విషయం మైన కాస్త ఫైర్ అవుతున్నట్లు తెలుస్తోంది. శింబు చివరిసారిగా పాతుథల అనే సినిమాలో కనిపించారు. ప్రస్తుతమైతే కమలహాసన్ నటిస్తున్న థగ్ లైఫ్ అనే చిత్రంలో కీలకమైన పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. మరి రాబోయే రోజుల్లో కీర్తి సురేష్ కి శింబు ఏదైనా సినిమాలో అవకాశాన్ని కల్పించి… కీర్తి సురేష్ కోరికను తీరుస్తారేమో చూడాలి. టాలీవుడ్ లో మాత్రం ఈ ముద్దుగుమ్మ ఏ సినిమాలో ఇంకా నటించలేదు.